యువతరం కదిలింది సినిమా షూటింగ్ ఒంగోలులో జరగడంతో మద్రాస్ నుంచి ఇంటికి వచ్చి ఇతర పనులు చూసుకుంటున్న కృష్ణ.. యువతరం కదిలింది చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులను చూసుకోవడం జరిగింది. అలా తన స్నేహితుడైన పోకూరి బాబూరావుతో టీ కృష్ణ తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. చిరంజీవితో తీయాలనుకున్న సినిమా ఆయన ఇమేజ్ పెరగడంతో వారు తయారు చేసుకున్న కథను రద్దు చేసుకొని తిరిగి కృష్ణ ఓ అభ్యుదయ చిత్రం రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో పి.సి.రెడ్డి దర్శకత్వంలో నవోదయం చిత్రం ముచ్చర్లఅరుణ, కవిత, విజయశాంతిలపై చిత్రీకరణ జరుగుతోంది.
అక్కడికి టీ.కృష్ణ పోకూరి బాబూరావు కలిసి వెళ్లారు. తను రాసుకున్న కథలో భారతి పాత్రకు విజయశాంతి సరిగ్గా సరిపోతుందని ఆమెను సంప్రదించారు. కానీ విజయశాంతి నాన్నగారు టి.కృష్ణ నిర్మాత పోకూరి బాబురావు కొత్తగా కనిపిస్తున్నారని.. మా అమ్మాయి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారని డేట్స్ ఖాళీ లేవని అన్నారు. ఆ క్రమంలో నిర్మాత ఎమ్మెస్ రెడ్డి, దర్శకుడు పి.సి.రెడ్డి లతో రికమండ్ చేస్తే విజయశాంతి ‘నేటిభారతం’ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత అట్రాక్షన్ ఫేసు యాక్టివ్ గా ఉండే పర్సన్ కావాలని అప్పుడే తెలుగులోకి వచ్చి ఇద్దరు కిలాడీలు, అపరాధి చిత్రంలో నటించిన సుమన్ ని హీరోగా అనుకున్నారు.
కాని పి.సి.రెడ్డి చెప్పితే సుమన్ నేటి భారతం సినిమాలో నటించడానికి అంగీకరించారు. అలా1983 జూన్ లో సినిమా షూటింగ్ ప్రారంభమయింది. టి.కృష్ణకు ఇదే మొదటి చిత్రం కాబట్టి సినిమాకి సహాయ దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను తీసుకున్నారు. సినిమా ఘన విజయం సాధించి విజయవాడలో విజయోత్సవ సభలో దర్శకుడు టి కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించిన ఆలోచనలు మొత్తము నావే కానీ నన్ను దర్శకుడిని చేసింది మాత్రం ముత్యాల సుబ్బయ్య ఆయన లేకుండా ఈ సినిమాను ఊహించలేము అన్నట్టుగా టి కృష్ణ చెప్పడం గమనార్హం. టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలలో నటించడం జరిగింది.
ఈ సినిమాలో పాపులర్ అయిన పాట..”అత్తా పోదాం రావే మన ఊరి దవాఖానకు”.. బండ్ల కిష్టయ్య రాసిన ఈ గీతం ప్రజానాట్యమండలి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాదరణ పొందింది. ఈ పాటను నేటి భారతం చిత్రంలో వాడుకున్నారు. మరొక పాట అయిన..”భారతమాతను నేను బందీ నై ఉన్నాను”. అనే పాట రేపే చిత్రీకరణ అయినా లొకేషన్ ఏమిటో యూనిట్ సభ్యుల్లో ఎవరికి టి.కృష్ణ చెప్పలేదు. మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో ఓ కాలి ఫ్లోర్ ని బుక్ చేయమని ఆయన పురమాయించారు. ఆర్ట్ డైరెక్టర్ తో ఒక చెరసాల వేయించారు. అలాగే భారతదేశ పటాన్ని గీయించారు, దాని చుట్టూ ఒక తాడును చుట్టించి మధ్యలో ఇసుక పోయించి విజయశాంతికి సంకెళ్లు పెట్టి మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పాట చిత్రీకరణ అద్భుతంగా జరిగిందనడానికి తెరపై కనిపించిన దృశ్యాలే కారణాలుగా పేర్కొనవచ్చు. అలా మొదటి చిత్రంతో దర్శకుడు టి.కృష్ణ అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…