తమిళంలో ఎంజీఆర్ పేరు చెబితే ఎంతటి ప్రభంజనమో కొత్తగా చెప్పే అవసరం లేదు. ఆయన సినిమాలు జాతీయస్థాయిలో ఎంతటి పేరు తెచ్చాయో ప్రత్యేకించి చర్చించవలసిన అవసరం లేదు. మామూలు పేద కుటుంబములో జన్మించి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఎంజీఆర్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆయన సినిమా రంగంలో అప్రతిహతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన నటించిన చిత్రాల్లో కూడా పేదవారి కష్టాలను ఎత్తిచూపుతూ సినిమాలు తీసేవారు.
1971 వీరప్పన్ నిర్మాణం, కృష్ణన్ దర్శకత్వంలో “రిక్షాకారన్” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఎం.జి.రామచంద్రన్, పద్మిని, మంజుల హీరో, హీరోయిన్లుగా నటించారు. రిక్షా కార్మికుడి చుట్టూ తిరిగే కథతో వచ్చిన రిక్షాకారన్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది. సినిమా సక్సెస్ కావడంతో హీరో ఎం.జి రామచంద్రన్ రిక్షాకార్మికులు అందరికీ ‘రైన్ కోట్ ‘ఇవ్వడం జరిగింది. తమిళంలో రిక్షా కార్మికుడు పై తీసిన మొదటి చిత్రంగా ఎంజీఆర్ నటించిన ‘రిక్షాకారణన్’ పేర్కొనవచ్చు. తెలుగులో దాదాపు 70 పైచిలుకు చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన సత్యనారాయణరాజు, కృష్ణతో సినిమా రూపొందించాలనుకున్నారు.
ఆ క్రమంలో కృష్ణ అంగీకారంతో తమిళంలో ఎంజీఆర్ నటించిన రిక్షాకారన్ చిత్రాన్ని తెలుగులో నిర్మించాలని ప్రయత్నించారు. ఆ సినిమాకి సంబంధించిన రచన బాధ్యతను త్రిపురనేని మహారధి కుమారుడు త్రిపురనేని చిట్టికి ఇవ్వడం జరిగింది. 1989లో అధికారంలో ఉన్న ఆనాటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పై వ్యంగ్య చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. అలా ఆ రచయిత అందించిన కథను తీసుకొని హీరో కృష్ణ “రిక్షావాలా” చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కృష్ణ స్వయంగా రాజకీయాల్లోకి దిగడంతో ఈ సినిమా కాస్త ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
1989 సత్యనారాయణరాజు నిర్మాణం, కృష్ణ దర్శకత్వంలో రిక్షావాలా చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది సూపర్ స్టార్ కృష్ణకు 274 వ చిత్రం. ఈ సినిమాలో అందరిచే ‘అన్నా’ అని పిలిపించుకునే కళింగపట్నం భుజంగరాయుడు పాత్రలో ప్రముఖ నటుడు రంగనాథ్ నటించారు. 1989 నవంబర్ లో రిక్షావాలా చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ హీరో కృష్ణ ఏలూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతుండడంతో సినిమా విడుదలను డిసెంబర్ కు వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వచ్చి సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని డిసెంబర్ లో రిక్షావాలా చిత్రాన్ని విడుదల చేశారు.
కృష్ణ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు సినిమా కూడా విజయవంతమవడం గమనార్హం. ఎన్టీ రామారావు హయాంలో నా పిలుపే ప్రభంజనం, గండికోట రహస్యం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, కలియుగ విశ్వామిత్ర లాంటి చిత్రాలు.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా విసిరిన రాజకీయ వ్యంగ్యాస్త్రాలుగా పేర్కొనవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…