Featured

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతి ప్రసాద్ కోట్లు ఎలా పోగొట్టున్నాడో తెలుసా..?

గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆహుతి ప్రసాద్ కోట్లు ఎలా పోగొట్టున్నాడో తెలిస్తే షాకవుతారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మంచి కమెడియన్‌గా పాపులారిటీని సంపాదించుకొని 300 పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆహుతి ప్రసాద్. సినిమా ఇండస్ట్రీ మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న ఆయన విక్రమ్ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి   పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు సీరియల్స్‌లో నటించాడు. వీటితో రాని గుర్తింపు రాజశేఖర్ హీరోగా నటించిన ఆహుతి సినిమాతో వచ్చింది.

దాంతో అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్‌గా సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ఆయనకు కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా వచ్చింది పోలీస్, రాజకీయ నాయకుడి పాత్రలే. ఆ పాత్రలోనూ ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేసే అవకాశాలు దక్కాయి. వచ్చిన ప్రతీ పాత్రలో మంచి విలనిజాన్ని ప్రదర్శించి క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు. నటుడిగా అవకాశాలు రాకముందు కొన్నాళ్ళు ఆయన యాక్టింగ్ నేర్చుకున్న మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మల్లె మొగ్గలు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అందివచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ సినిమాలో నటుడిగా అవకాశం అందుకున్నారు. నటన పరంగా చేసిన పాత్రతో మెప్పిస్తూ దర్శక నిర్మాతల దృష్ఠిని బాగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్నారు. అలా వచ్చిన అవకాశాలతోనే మంచి రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇలా వచ్చిన అవకాశం పోలీస్ భార్య సినిమా. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్ నటనకు మంచి పేరొచ్చింది. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు.

అలా తెలుగులో సూపర్ హిట్ అయిన పోలీస్ భార్య సినిమా రైట్స్ కొని కన్నడలో నిర్మించారు. కన్నడలో కూడా పోలీస్ భార్య సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇదే క్రమంలో మరో రెండు సినిమాలను రైట్స్ కొని నిర్మించారు. కానీ ఆ సినిమాలు అట్టర్ ఫ్లాపవడంతో నిర్మాతగా తీవ్ర నష్టాలను చూశారు. ఆ సమయంలో ఆయనకు కొట్లలో నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ కేవలం నటన మీదే దృష్టిపెట్టారు. అలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆహుతి ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమాతో కమెడియన్‌గా మారాడు.

ఇది నిజంగా ఆహుతి ప్రసాద్‌కు అద్భుతమైన అవకాశం. కృష్ణవంశీ ఇలాంటి పాత్రను ఆహుతి ప్రసాద్‌తో చేయించాలనుకోవడం కూడా పెద్ద సాహసం. కృష్ణవంశీ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్‌ను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు ఆహుతి ప్రసాద్. ఇందులో ఆయన భాష – డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా నుంచి విలన్ రోల్స్ పక్కన పెట్టి పూర్తి స్థాయి కమెడియన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపించి ఆ పాత్రల్లోనూ సక్సెస్ అయ్యారు. మాడ్యులేషన్ ఏదైనా తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పర్ఫార్మ్ చేసి మంచి సక్సెస్, పేరు తెచ్చుకున్నారు ఆహుతి ప్రసాద్. నిర్మాతగా గనక సినిమాలు చేయకపోయి ఉంటే మరిన్ని మంచి సినిమాలతో సక్సెస్ చూసేవారు. ఒకదశలో ఆయనను కుదిపేసింది సినిమా నిర్మాణమే. కానీ, త్వరగా అందులో నుంచి బయటడం మనోవేదనకు గురి కాకుండా నటన మీద ఆసక్తి పెట్టడం గొప్ప విషయం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులు వీరే.. తొలిసారి పేర్లు వెల్లడించిన భారత ఆర్మీ..!

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…

20 hours ago

బిగ్‌బాస్-10లో పోలీస్ ఎంట్రీ..? ఎస్‌ఐ వీడియోపై నెటిజన్లలో హాట్ డిబేట్..!

తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…

20 hours ago

ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తున్నారా..? ఈ తప్పు చేస్తే ఆరోగ్యానికే ముప్పు..!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…

20 hours ago

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బాహుబలి 3’ రానుందంటూ ప్రకటన..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…

1 day ago

‘పెద్ది’ ప్రభావమా..? చరణ్-సుకుమార్ సినిమాకు బడ్జెట్ కత్తెర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…

1 day ago

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

1 day ago