భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయానికి గురి చేస్తోంది. సెకండ్ వేవ్ వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో రోజుకు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అయితే కరోనా కేసులు ఈ విధంగా పెరగడానికి కారణమైన ఆ డేంజరస్ వేరియంట్ బి.1.617 మూలాలపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతటి భయంకరమైన వేరియంట్ మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టిందని పలు థియరీలు చెబుతున్నాయి.
ఈ వేరియంట్ అమరావతిలో పుట్టడం వల్ల అమరావతిలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఫిబ్రవరి నెలలోనే అధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ థియరీ భావిస్తోంది. ఇండియాలో ఏర్పడిన ఈ వేరియంట్ ఇతర దేశాలయినా బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు పూర్తి భిన్నంగా ఉందని డాక్టర్ నితిన్ షిండే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వేరియంట్ పై ఇప్పటివరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పుడే దీనిపై ఒక అవగాహనకు రాలేమని షిండే తెలిపారు.
ఈ బి.1.617 వేరియంట్నే డబుల్ మ్యుటెంట్గా పిలుస్తున్నారు. ఇందులో గమనించాల్సిన మ్యుటేషన్లు ఇ484క్యూ, ఎల్425ఆర్ ఈ మ్యుటెంట్ లు వైరస్ వేగంగా వ్యాపించడానికి దోహదపడుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ తెలియజేశారు. ఈ సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ముందే ఈ వేరియంట్ కనుగొన్నారని, ఈ సెకండ్ వేవ్ స్థాయిలో విజృంభించడానికి కారణం ఈ
మ్యుటెంట్ ప్రధాన కారణమని చెప్పలేమని ఆమె తెలిపారు.
గతంలో కంటే ప్రస్తుతం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే రోజురోజుకు ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంత భయంకరమైన వేరియంట్ పై కూడా భారత బయోటెక్ కి చెందిన కొవాగ్జిన్ ఎంతో సమర్ధవంతంగా పని చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…