భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయానికి గురి చేస్తోంది. సెకండ్ వేవ్ వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో రోజుకు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అయితే కరోనా కేసులు ఈ విధంగా పెరగడానికి కారణమైన ఆ డేంజరస్ వేరియంట్ బి.1.617 మూలాలపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతటి భయంకరమైన వేరియంట్ మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టిందని పలు థియరీలు చెబుతున్నాయి.
ఈ వేరియంట్ అమరావతిలో పుట్టడం వల్ల అమరావతిలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఫిబ్రవరి నెలలోనే అధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ థియరీ భావిస్తోంది. ఇండియాలో ఏర్పడిన ఈ వేరియంట్ ఇతర దేశాలయినా బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు పూర్తి భిన్నంగా ఉందని డాక్టర్ నితిన్ షిండే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వేరియంట్ పై ఇప్పటివరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పుడే దీనిపై ఒక అవగాహనకు రాలేమని షిండే తెలిపారు.
ఈ బి.1.617 వేరియంట్నే డబుల్ మ్యుటెంట్గా పిలుస్తున్నారు. ఇందులో గమనించాల్సిన మ్యుటేషన్లు ఇ484క్యూ, ఎల్425ఆర్ ఈ మ్యుటెంట్ లు వైరస్ వేగంగా వ్యాపించడానికి దోహదపడుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ తెలియజేశారు. ఈ సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ముందే ఈ వేరియంట్ కనుగొన్నారని, ఈ సెకండ్ వేవ్ స్థాయిలో విజృంభించడానికి కారణం ఈ
మ్యుటెంట్ ప్రధాన కారణమని చెప్పలేమని ఆమె తెలిపారు.
గతంలో కంటే ప్రస్తుతం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే రోజురోజుకు ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంత భయంకరమైన వేరియంట్ పై కూడా భారత బయోటెక్ కి చెందిన కొవాగ్జిన్ ఎంతో సమర్ధవంతంగా పని చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…