Featured

దేశం మొత్తాన్ని షేక్ చేసిన ఈ అరుదైన చిత్రాన్ని వదులుకున్న హీరో ఎవరో తెలుసా.?!

ఈ దర్శకుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్క నటీనటులు అనుకుంటారు. కానీ కొంతమందికే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారే భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సృజనాత్మక, యదార్థగాథలతో సహజమైన చిత్రీకరణతో ఆ దర్శకుడి సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు సగటు మనిషి నిజ జీవితానికి అద్దం పడతాయి.

1992లో దర్శకుడు మణిరత్నం రోజా చిత్రంతో తెలుగు సినిమాలకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి, మధుబాల హీరో హీరోయిన్స్ గా నటించారు. రోజా సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1993లో దొంగ దొంగ సినిమా తీస్తున్న సమయంలో ముంబై అల్లర్లు జరగడం మణిరత్నం ను కదిలించడం జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో.. ఒక వర్గం ప్రజలు మరో వర్గం మీద దాడి చేయడంతో ముంబైలో విపరీతమైన ఘర్షణలు చెలరేగాయి.

ఇలా జరిగిన సంఘటన నుంచి మణిరత్నం ఒక కథ తయారు చేసుకోవడం జరిగింది. అలా ముంబై సినిమా కోసం మొదటగా హీరో విక్రమ్ ను కలవడం జరిగింది. అప్పటికి తాను గడ్డం మీసాలతో ఉండడం చూసిన మన మణిరత్నం అవి తీయించుకొని సినిమాలో నటించాలని కోరగా.. విక్రమ్ దానికి ఒప్పుకోలేదు. అలా ఆ ఆఫర్ రోజా సినిమాలో హీరోగా నటించిన అరవింద్ స్వామికి వెళ్ళింది.

1995 మార్చి 10న విడుదలైన బొంబాయి సినిమా దేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమయ్యింది. హైదరాబాదులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను మూసివేయడం జరిగింది. బొంబాయి సినిమా అన్ని నిభాషల్లోను విడుదలై ఘన విజయాన్ని సాధించింది

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago