“క్యాష్” దొరికినంత దోచుకో, “వావ్” మంచి కిక్కిచ్చే గేమ్ షో, పండుగ చేస్కో, స్టార్ మహిళ, మోడ్రన్ మహాలక్ష్మి అనే ముచ్చటైన పేర్లతో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు గేమ్ షోలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గేమ్ షోలలో పాల్గొనే కంటెస్టెంట్లు లక్షల కొద్దీ సొమ్మును సంపాదించుకున్నట్టు చూపిస్తుంటారు. అయితే నిజంగా కంటెస్టెంట్లు డబ్బు సంపాదిస్తారా అనే అనుమానం బుల్లితెర ప్రేక్షకులలో కలగకమానదు. అసలు అందులో నిజమెంతో అబద్ధమెంతో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
బుల్లితెర గేమ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కార్యక్రమం తనకి పోయేంత వరకూ డబ్బులు ఇచ్చినట్టు, తీసుకున్నట్టు కానీ నటిస్తారు. యాంకర్ సుమ క్యాష్ షో లో లక్షల రూపాయలు ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ అదంతా ఉత్తదే. సెలబ్రెటీలు పాల్గొనే అన్ని గేమ్ షోలలో డబ్బులు రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ప్రోగ్రాం లో ఇచ్చినట్టు చూపిస్తారు కానీ అది నిజమని నమ్మితే పప్పులో కాలేసినట్టే లెక్క. సాయి కుమార్ హోస్ట్ గా బాధ్యతలను నిర్వర్తించే వావ్ గేమ్ షోలో కంటెస్టెంట్లగా పాల్గొన్న సెలబ్రిటీలకు లక్షల రూపాయలు ఇచ్చినట్టు చూపిస్తుంటారు. షోలో ఆడుతున్నప్పుడు కంటెస్టెంట్లు డబ్బులు కోల్పోతే నిజంగానే ఆస్తంతా పోయినట్టు గగ్గోలు పెడుతుంటారు కానీ అదంతా నటనే. గేమ్ షోలో అడిగే క్వశ్చన్ లకు మాత్రం సమాధానాలు ముందుగా చెప్పరు. ఒక్క డబ్బు విషయం తప్ప గేమ్ షోలో జరిగేవన్నీ దాదాపు నిజమే.
అయితే గేమ్ షోలో కుర్చీలో కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించే ప్రేక్షకులు జూనియర్ ఆర్టిస్టులు కాగా… వారికి మాత్రం రూ. 500 నుండి 1000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ ట్రెండ్ అంతరించిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం టీవీ నిర్వాహకులు షో మేనేజర్లను ఏదో ఒక కాలేజీకి పంపించి విద్యార్థులను షోలో ప్రేక్షకులుగా కూర్చోబెట్టమని అడుగుతున్నారు. టీవీలో కనిపించవచ్చని చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ గేమ్ షోలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఫలితంగా జూనియర్ ఆర్టిస్టులను పిలిపించి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. అలాగే గేమ్ షోలను కాలేజీ స్టూడెంట్స్ తో పాటు వారి బంధు మిత్రులందరూ కూడా తప్పకుండా వీక్షిస్తుంటారు. దాంతో గేమ్ కి ఉచిత ప్రచారం కూడా లభిస్తుంది.
ఇకపోతే స్టార్ మహిళ, పండగ చేస్కో వంటి ప్రోగ్రాములలో సామాన్యులు పాల్గొంటుంటారు. వాళ్లకి ఈ గేమ్ షో లో ఇచ్చే బహుమతులు, డబ్బులు కూడా నిజంగానే ఇస్తారు. డాన్స్, పాటల రియాల్టీ షోలలో కూడా పార్టిసిపెంట్లకు డబ్బులు ఇస్తారు కానీ టాక్స్ పేరిట 40 శాతం వరకు తీసుకొని మిగతా డబ్బులు ఇస్తారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…