Connect with us

Featured

గేమ్ షోస్ లో ప్రైజ్ మనీ నిజంగా ఇస్తారా? అస్సలు డ్రామా తెలియాలంటే ఇది చదవాల్సిందే… !

Published

on

“క్యాష్” దొరికినంత దోచుకో, “వావ్” మంచి కిక్కిచ్చే గేమ్ షో, పండుగ చేస్కో, స్టార్ మహిళ, మోడ్రన్ మహాలక్ష్మి అనే ముచ్చటైన పేర్లతో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు గేమ్ షోలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గేమ్ షోలలో పాల్గొనే కంటెస్టెంట్లు లక్షల కొద్దీ సొమ్మును సంపాదించుకున్నట్టు చూపిస్తుంటారు. అయితే నిజంగా కంటెస్టెంట్లు డబ్బు సంపాదిస్తారా అనే అనుమానం బుల్లితెర ప్రేక్షకులలో కలగకమానదు. అసలు అందులో నిజమెంతో అబద్ధమెంతో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బుల్లితెర గేమ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు కార్యక్రమం తనకి పోయేంత వరకూ డబ్బులు ఇచ్చినట్టు, తీసుకున్నట్టు కానీ నటిస్తారు. యాంకర్ సుమ క్యాష్ షో లో లక్షల రూపాయలు ఇచ్చినట్లు చూపిస్తున్నారు కానీ అదంతా ఉత్తదే. సెలబ్రెటీలు పాల్గొనే అన్ని గేమ్ షోలలో డబ్బులు రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ప్రోగ్రాం లో ఇచ్చినట్టు చూపిస్తారు కానీ అది నిజమని నమ్మితే పప్పులో కాలేసినట్టే లెక్క. సాయి కుమార్ హోస్ట్ గా బాధ్యతలను నిర్వర్తించే వావ్ గేమ్ షోలో కంటెస్టెంట్లగా పాల్గొన్న సెలబ్రిటీలకు లక్షల రూపాయలు ఇచ్చినట్టు చూపిస్తుంటారు. షోలో ఆడుతున్నప్పుడు కంటెస్టెంట్లు డబ్బులు కోల్పోతే నిజంగానే ఆస్తంతా పోయినట్టు గగ్గోలు పెడుతుంటారు కానీ అదంతా నటనే. గేమ్ షోలో అడిగే క్వశ్చన్ లకు మాత్రం సమాధానాలు ముందుగా చెప్పరు. ఒక్క డబ్బు విషయం తప్ప గేమ్ షోలో జరిగేవన్నీ దాదాపు నిజమే.

అయితే గేమ్ షోలో కుర్చీలో కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించే ప్రేక్షకులు జూనియర్ ఆర్టిస్టులు కాగా… వారికి మాత్రం రూ. 500 నుండి 1000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ ట్రెండ్ అంతరించిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం టీవీ నిర్వాహకులు షో మేనేజర్లను ఏదో ఒక కాలేజీకి పంపించి విద్యార్థులను షోలో ప్రేక్షకులుగా కూర్చోబెట్టమని అడుగుతున్నారు. టీవీలో కనిపించవచ్చని చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ గేమ్ షోలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఫలితంగా జూనియర్ ఆర్టిస్టులను పిలిపించి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. అలాగే గేమ్ షోలను కాలేజీ స్టూడెంట్స్ తో పాటు వారి బంధు మిత్రులందరూ కూడా తప్పకుండా వీక్షిస్తుంటారు. దాంతో గేమ్ కి ఉచిత ప్రచారం కూడా లభిస్తుంది.

ఇకపోతే స్టార్ మహిళ, పండగ చేస్కో వంటి ప్రోగ్రాములలో సామాన్యులు పాల్గొంటుంటారు. వాళ్లకి ఈ గేమ్ షో లో ఇచ్చే బహుమతులు, డబ్బులు కూడా నిజంగానే ఇస్తారు. డాన్స్, పాటల రియాల్టీ షోలలో కూడా పార్టిసిపెంట్లకు డబ్బులు ఇస్తారు కానీ టాక్స్ పేరిట 40 శాతం వరకు తీసుకొని మిగతా డబ్బులు ఇస్తారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!