ఒకే జోనర్ సినిమాలు ఇప్పటికే సౌత్లోని భాషలలో అలాగే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకే పాయింట్తో కథ అల్లి సినిమా తీసి హిట్ అందుకున్న దర్శక, నిర్మాతలు, హీరోలు ఉన్నారు. కథా నేపథ్యం కూడా ఒకటే అయినా స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ వేరేగా రాసుకొని బ్లాక్ బస్టర్స్ అందుకున్న వారు ఉన్నారు. నందమూరి సోదరులు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఇద్దరు ఒకే జోనర్లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తారక్ టెంపర్ అనే సినిమా చేశాడు. అదే సమయంలో కళ్యాణ్ రాం కూడా పటాస్ అనే సినిమా చేశాడు.
పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక పూరి స్టార్ డైరెక్టర్. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తమ సినిమాలను రూపొందించారు. ఈ విషయం తెలుసుకొని కళ్యాణ్ రాం పూరి వద్దకి వెళ్ళి సార్ మీరు మేము చేస్తున్న కథ ఒకటే అండి అన్నాడు. దానికి పూరి నవ్వుతూ ఇండస్ట్రీలో వచ్చే సినిమా కథలన్నీ ఒకటే. ఒక్కో దర్శకుడు కథను ఒక్కోలా తీస్తాడు. నేనున్నా కదా..మీరు మీ స్టైల్లో తీయండి అని భరోసా ఇచ్చారు. అలా రెండు వారాల గ్యాప్లో ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాతో, కళ్యాణ్ రాం – అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు.
అయితే ఒకే జోనర్తో ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా కూడా రెండు సినిమాలు ఫ్లాప్గా మిగిలాయి. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా ఆ సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాలే ‘చంటబ్బాయి’, ‘డిటెక్టివ్ నారద’. ‘చంటబ్బాయి’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి – సుహాసిని జంటగా నటించారు. జగ్గయ్య కీలక పాత్రలో నటించారు. ప్రముఖ హాస్య చిత్రాల దర్శక దిగ్గజం జంధ్యాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా కథకి మూలం పీటర్ సెల్లర్ రాసిన అ షార్ట్ ఇన్ ది డార్క్ అనే నవల. మంచి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి హీరోయిజం పక్కన పెట్టి జంధ్యాల శైలి సినిమాలో నటించాలని ఉత్సాహంతో ‘చంటబ్బాయి’ చేశారు.
ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా వచ్చింది. అయితే చిరంజీవి ఇమేజ్, జంధ్యాల ఇమేజ్ ‘చంటబ్బాయి’ సినిమా హిట్ సినిమాగా నిలపలేకపోయాయి. చిరంజీవి డిటెక్టివ్ పాత్రలో కడుపుబ్బా నవ్వించిన చంటబ్బాయి సినిమా బావుందన్న టాక్ తప్ప కమర్షియల్ హిట్గా మాత్రం నిలవలేకపోయింది.
ఇక మంచు మోహన్ బాబు కూడా డిటెక్టివ్ పాత్రలో నటించారు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించారు. 1992 లో వచ్చిన ‘డిటెక్టివ్ నారద’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇది కూడా ఒక స్టార్ డైరెక్టర్ – స్టార్ హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమా. మ్యూజికల్ గా కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు.
‘డిటెక్టివ్ నారద’ సినిమాలో గుర్తుండే ఒకే ఒక్క పాట ప్రేమ యాత్రలకు మాత్రం ఇప్పటికీ వినిపిస్తుంది. అయితే ఇద్దరు స్టార్ డైరెక్టర్ హీరోల కాంబినేషన్లో వచ్చిన డిటెక్టివ్ కథలు ఫ్లాపవడానికి కారణం వాటిని కామెడీ జోనర్లో రూపొందించడమే. సీరియస్ గా సాగే కథను హీరో పాత్రలో కామెడీని నింపేసి తెరకెక్కించడం మైనస్ అయిందని అప్పట్లో చెప్పుకున్నారు. మళ్ళీ అటు చిరంజీవి గానీ, ఇటు మోహన్ బాబు గానీ ఈ తరహా కథలలో నటించలేదు. అంతేకాదు దర్శకులు వంశీ – జంధ్యాల కూడా మళ్లీ ఇదే జోనర్లో సినిమాలు తీయలేదు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…