80 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వృద్ధుడికి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. డబ్బు ఉన్నదన్న పొగరుతో అతడు ఎవరితోనైనా దురుసుగా మాట్లాడేవాడు. ఓ రోజు ఓ కిరాణా దుకాణానికి వెళ్లి.. నీ భార్యను నాతో పంపు.. రూ. 10 వేలు ఇస్తానని కోరాడు. దీంతో కోపంతో ఆ షాప్ యజమాని అతడిని ఎంచేశాడో తెలుసా.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానికంగా నివాసం ఉండే 80 ఏళ్ల వృద్దుడు శమకాంత్ తుకారమ్ నాయక్.. ఉల్వేలో కోట్లు విలువ చేసే అనేక ఆస్తులను కలిగి ఉన్నాడు. అతడు అక్కడే ఉన్న మోహన చౌదరి (33) అనే వ్యక్తి షాపుకు వెళ్తూ ఉండేవాడు. ఓ రోజు ఇలా అతడి షాప్ కి వెళ్లి నీ భార్యను నాతో పంపు.. రూ.5 వేలు ఇస్తాననంటూ అడిగాడు.. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక మరో రోజు అలానే వెళ్లి ఈ సారి రూ.10 వేలు ఇస్తాను.. నా గౌడాన్ కు నీ భార్యను పంపు అని మళ్లీ కోరాడు. అతడి డిమాండ్ కు విసుగు చెందిన మోహన్ అతడిని వెనక్కి నెట్టాడు. ఆ క్రమంలో శమకాంత్ తుకారమ్ తల ఓ టేబుల్ కొనకు తగలడంతో కింద పడి పోయాడు. వెంటనే ఓ కత్తి తీసుకొని అతడి గొంతు కోసి హత్య చేశడు.
వెంటనే షాప్ మూసేసిన మోహన్ ఆ శవాన్ని దాచి మరుసటి రోజు ఆ శవాన్ని సైకిల్ పై తీసుకెళ్లి ఊరి చివర పడేశాడు. తన తండ్రి కనిపించడం లేదంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి శమకాంత్ నాయక్ కొడుకు శేఖర్ నాయక్ వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని గుర్తించి.. మోహన్ ను అరెస్టు చేశారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…