Categories: FeaturedGeneral News

టీసీఎస్ ఐటీ సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం లేనట్లే.. ఎప్పటి నుంచంటే..

కరోనా మొదలైన దగ్గర నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు ఎంతో మంది ప్రజలు కరోనా కారణంగా మరణించారు. వారిని నమ్ముకున్న ఎంతో మంది కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొంత మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇతర రంగాల్లో పని చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ ఆ ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగుల పై పడలేదనే చెప్పాలి.

ఎందుకంటే.. లాక్ డౌన్ సమయంలో కూడా.. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను అనుసరించాయి. అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ కంపెనీలు వెల్లడించాయి.

దీంతో ఇప్పుడు ఆ పనికి స్వస్తి పలకనున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో వర్క్ ఫ్రం హోంకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్ తెలిపింది. వచ్చే సంవత్సరం జనవరిలోనైనా.. లేదా ఈ సంవత్సరం చివర్లో అయినా ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ రాజేశ్‌ గోపీనాధన్‌ తెలిపారు.

మొత్తం 5 లక్షల మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి తెలపనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. టీసీఎస్ కంపెనీలో ఈ విధానం అమలైతే మాత్రం ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే కోవలోకి వెళ్లనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

5 minutes ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

3 hours ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

3 hours ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

3 hours ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

3 hours ago

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

3 hours ago