ఈ సృజనాత్మక దర్శకుడు తెలియని తమిళ తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో అనిపిస్తుంది. విభిన్నమైన కథాంశంతో తన సృజనాత్మకత తో సినిమాను మరో స్థాయిలో చూపించే దర్శకుడు మణిరత్నం. ఇక ఇళయరాజా గురించి చెప్పాలి అంటే ఏ సినిమా గురించి ప్రస్తావిస్తే ఆయన నైపుణ్యం కనిపిస్తుందో తెలియదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ అద్భుత కళాఖండాలుగా చెప్పుకోవచ్చు. ఆయన స్వరపరచిన గీతాలు దక్షిణాది ప్రేక్షకుడి గుండెలను తాకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో కమల్ హాసన్ నటించిన నాయకుడు, నాగార్జున నటించిన గీతాంజలి, మాస్టర్ తరుణ్ బేబీ షామిలి నటించిన అంజలి, రజనీకాంత్ మమ్ముట్టి నటించిన దళపతి వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఈ అద్భుతమైన విజయాల వెనుక ఇళయరాజా, మణిరత్నంల సాధారణమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సాధారణంగా ఇళయరాజా కథ వినగానే తన మనసులో ఊహించుకుని పాటలకు బాణీలు కట్టడం, బి.జి.ఎమ్ సమకూర్చడం వంటివి చేస్తుండేవారు. కొత్త లో మణిరత్నం ఆ విషయంలో జోక్యం చేసుకునే వారు కాదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో 5 చిత్రాలు వచ్చేసరికి మణిరత్నం బాణీలు, RR విషయంలో జోక్యం చేసు కోవడం ప్రారంభించారు. ఇది ఇళయరాజాకు నచ్చేది కాదు అలా అభిప్రాయభేదాలు దళపతి వరకు కొనసాగి తర్వాత సినిమాకి కొత్త సంగీత దర్శకునితో తీయాలనే వరకు వచ్చింది. త్రిలోక్ తో పరిచయము ఉన్న మణిరత్నం ఆయన సలహా మేరకు కొత్త కుర్రాడు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయత్నిస్తున్నాడని ఏ.ఆర్.రెహమాన్ వద్దకు వెళ్లారు. ఆయన చేసిన కొన్ని క్యాసెట్లను తీసుకెళ్లి మణిరత్నం విన్నారు. దాదాపు రెండు నెలల తర్వాత దొంగ దొంగ కథ చెప్పారు.
అయితే బాలచందర్ ఆ సినిమా తర్వాత తీద్దామని అనడంతో మణిరత్నం రోజా అనే సినిమా కథని మళ్లీ ఏ.ఆర్.రెహమాన్ కి చెప్పారు. అలా ఏ.ఆర్.రెహమాన్ రోజా సినిమాకి మొదటి పాటకి ట్యూన్ కట్టారు. ఆ ట్యూన్ కి పాట రాయడానికి తమిళంలో ఫేమస్ రైటర్ వైరముత్తు ని పిలిపించారు. అక్కడ ఏ.ఆర్.రెహమాన్ చూసిన వైరముత్తు ఆశ్చర్యపోతూ ఇంతకుముందు ఓ మామూలు కీబోర్డ్ ప్లేయర్ ఎంతో పేరున్న మణిరత్నం సినిమాకి సంగీత దర్శకుడా ఇక సినిమా ఆడినట్టే అని తన మనసులో అనుకున్నారట. అలా రోజా సినిమాకి మొదటి పాట గా “చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. అనే పాటను వైరముత్తు రాశారు. 1992 సినిమా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏ.ఆర్.రెహమాన్ కి ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…