భాగ్యచక్రం సినిమా షూటింగ్ జరుగుతోంది అక్కడ హీరోతో ఒక కమెడియన్ చీకటి ఉంది భయమేస్తుంది.. అనే సంభాషణ పలకాలి అలా కాకుండా కేవలం ఎక్స్ ప్రెషన్ తో ఆ సీన్ తీద్దామని మాటల రచయిత పింగళితో చెప్పగా అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు విన్నారు. నిజంగా మాటలు లేకుండా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అనే ఆలోచన అక్కడే పుట్టింది. అలా దాదాపు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సింగీతం శ్రీనివాసరావు ఒక కథ రాసుకున్నారు.
ఒక పేద నిరుద్యోగి అకస్మాత్తుగా కోటీశ్వరుడు అవుతాడు అనే కథ బాగా రావడంతో అప్పుడు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ తో చెప్పగా.. అప్పుడు కమల్ హాసన్ ఈ సినిమాను తప్పకుండా చేద్దామని అంగీకరించాడు. ఇక హీరోయిన్ ఎవరు అనే సందర్భంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ముంబై వెళ్లి నీలం కొటారిని కలిశారు. ఆమె ఆ సినిమా చేయడానికి కొన్ని షరతులు విధించింది. ఆ తర్వాత మరొక బాలివుడ్ సినీ ప్రముఖుడు మాధురి దీక్షిత్ పేరు చెప్పగానే ఆమెను కలిశారు. మాటలు లేని సినిమా మేము చేయమని ఆమె చెప్పడంతో సింగీతం శ్రీనివాసరావు వెనుతిరిగారు. ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు తనకు సన్మానం చేస్తున్న కార్యక్రమానికి అమల యాంకర్ గా వచ్చింది. అక్కడ సింగీతం శ్రీనివాసరావు అమలను చూసి తను తీయబోయే పుష్పక విమానం చిత్రానికి ఆమె బాగా ఉంటుందని అనుకున్నారు. కానీ చాలా మంది సినీ ప్రముఖులు ఆమె ఇండస్ట్రీకి కొత్త నటన సరిగ్గా రాదు అని చెప్పారు.
అయిన కూడా వారి మాటలు లెక్కచేయకుండా ఆ సినిమాకి అమల నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. విలన్ గా అమ్రిష్ పురిని అనుకున్నప్పటికీ చివరికి టిను ఆనంద్ ను ఎంపిక చేశారు. బెంగళూరులో ఒక విమానానికి పుష్పక్ అనే పేరు ఉండటంతో పుష్పక్ అనే పదం సింగీతం శ్రీనివాసరావు నచ్చి తన సినిమాకి పుష్పక విమానం అని పేరు పెట్టడం జరిగింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సెన్సార్ కు వెళ్ళిన పుష్పకవిమానం. అక్కడ సెన్సార్ వాళ్ళు మాటలు లేని సినిమాకి సెన్సార్ చేయమని చెప్పారు. అప్పుడు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆ సినిమాలో సందర్భానుసారంగా రేడియోలో ఒక పాటను సెట్ చేశారు. అలా సెన్సార్ పొందిన పుష్పక విమానం 1987 లో విడుదలై సినీ ప్రముఖుల అభినందనలను పొందింది. టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత మూకీ గా వచ్చిన పుష్పక విమానం ఇతర భాషల్లోకి పుష్పక్ అనే టైటిల్ తో విడుదల కావడం జరిగింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…