ఏ.ఎన్.ఆర్, ఎన్టీఆర్ లు సినిమాలు చూసి సంతోషపడే నరసింహ రాజు అద్దంలో తన ముఖం చూసుకొని అచ్చు హీరోలా గా ఉన్నానని మురిసిపోయాడు. ఇంట్లో చెప్పకుండానే మద్రాసు రైలెక్కేశాడు. అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ అవకాశాలు ఏమీ రాలేదు. చేతిలో డబ్బు అయిపోవడం మూలాన తిరిగి పశ్చిమ గోదావరి జిల్లా తన సొంతూరు వడ్లూరుకు రావడం జరిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకుని తిరిగి మద్రాసు వెళ్లిపోయారు. అలా నరసింహ రాజు1974లో నీడలేని ఆడది సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో 1975 లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాని తెలుగులో దాసరి దర్శకత్వంలో పునర్నిర్మించారు.
ఆ తూర్పు పడమర సినిమాలో శ్రీవిద్య సరసన నరసింహరాజు నటించారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో విఠలాచార్య జగన్మోహిని తీస్తున్నారని తెలిసి ఆయనను కలవడానికి వెళ్లారు. అంతకుముందే విఠలాచార్య కూడా నరసింహారాజు ను హీరోగా పెట్టి జగన్మోహిని తీద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో 1978లో జగన్మోహిని చిత్రంలో నరసింహరాజు జయమాలిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత గంధర్వ కన్య, మంత్రదండం, పున్నమినాగు పునాదిరాళ్లు లాంటి చిత్రాల్లో నరసింహరాజు నటించారు. అయితే 1977 నవంబర్లో వచ్చిన దివిసీమ తుఫాను తెలుగు ప్రజల బతుకుల్ని అతలాకుతలం చేసింది. దాదాపు నాలుగు లక్షల జంతువులు చనిపోయాయి. 8300 మంది ప్రజలు చనిపోయారని ఒక అంచనా, 80కి పైగా గ్రామాలు కొట్టుకుపోయాయి.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం గా దీనిని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిమీద స్పందించాయి. తెలుగు సినీ పరిశ్రమ దివిసీమ వైపరీత్యాన్ని చూసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సినీ పరిశ్రమ పెద్దలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు ప్రజల వద్దకు వెళ్లి చందాలు వసూలు చేసి వసూలైన మొత్తాన్ని ప్రజలకు ఖర్చు చేయాలనుకున్నారు. ఆ క్రమంలో హీరో నరసింహరాజు ఇలా చందాలు వసూలు చేసేకంటే ఈ స్టార్ హీరోలే ఫ్రీగా ఓ సినిమా చేసి వచ్చిన డబ్బులు బాధిత ప్రజలకు ఇస్తే బాగుంటుంది కదా అని సదుద్దేశంతో చెప్పినప్పటికీ అది కాస్త ఆ రోజుల్లో కాంట్రవర్సీ గా మారింది.
శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…
మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…
ఐపీఎల్ 2026 సీజన్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వేలంలో పెద్దగా డిమాండ్ లేకపోయిన ఒక ఆటగాడు, ఇప్పుడు మైదానంలో తన…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వరుస పరాజయాలు జట్టుపై ఒత్తిడిని…
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోనల్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం చర్మం, శక్తి స్థాయి మాత్రమే…
ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.…