Connect with us

Featured

దివిసీమ తుఫాన్ విషయంలో హీరో నరసింహరాజు పేపర్ స్టేట్మెంట్ ఎందుకు కాంట్రవర్సీ అయ్యిందో తెలుసా.?!

Published

on

ఏ.ఎన్.ఆర్, ఎన్టీఆర్ లు సినిమాలు చూసి సంతోషపడే నరసింహ రాజు అద్దంలో తన ముఖం చూసుకొని అచ్చు హీరోలా గా ఉన్నానని మురిసిపోయాడు. ఇంట్లో చెప్పకుండానే మద్రాసు రైలెక్కేశాడు. అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ అవకాశాలు ఏమీ రాలేదు. చేతిలో డబ్బు అయిపోవడం మూలాన తిరిగి పశ్చిమ గోదావరి జిల్లా తన సొంతూరు వడ్లూరుకు రావడం జరిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకుని తిరిగి మద్రాసు వెళ్లిపోయారు. అలా నరసింహ రాజు1974లో నీడలేని ఆడది సినిమాలో నటించారు. ఆ తర్వాత తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో 1975 లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాని తెలుగులో దాసరి దర్శకత్వంలో పునర్నిర్మించారు.

ఆ తూర్పు పడమర సినిమాలో శ్రీవిద్య సరసన నరసింహరాజు నటించారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో విఠలాచార్య జగన్మోహిని తీస్తున్నారని తెలిసి ఆయనను కలవడానికి వెళ్లారు. అంతకుముందే విఠలాచార్య కూడా నరసింహారాజు ను హీరోగా పెట్టి జగన్మోహిని తీద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో 1978లో జగన్మోహిని చిత్రంలో నరసింహరాజు జయమాలిని హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత గంధర్వ కన్య, మంత్రదండం, పున్నమినాగు పునాదిరాళ్లు లాంటి చిత్రాల్లో నరసింహరాజు నటించారు. అయితే 1977 నవంబర్లో వచ్చిన దివిసీమ తుఫాను తెలుగు ప్రజల బతుకుల్ని అతలాకుతలం చేసింది. దాదాపు నాలుగు లక్షల జంతువులు చనిపోయాయి. 8300 మంది ప్రజలు చనిపోయారని ఒక అంచనా, 80కి పైగా గ్రామాలు కొట్టుకుపోయాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం గా దీనిని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిమీద స్పందించాయి. తెలుగు సినీ పరిశ్రమ దివిసీమ వైపరీత్యాన్ని చూసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సినీ పరిశ్రమ పెద్దలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు ప్రజల వద్దకు వెళ్లి చందాలు వసూలు చేసి వసూలైన మొత్తాన్ని ప్రజలకు ఖర్చు చేయాలనుకున్నారు. ఆ క్రమంలో హీరో నరసింహరాజు ఇలా చందాలు వసూలు చేసేకంటే ఈ స్టార్ హీరోలే ఫ్రీగా ఓ సినిమా చేసి వచ్చిన డబ్బులు బాధిత ప్రజలకు ఇస్తే బాగుంటుంది కదా అని సదుద్దేశంతో చెప్పినప్పటికీ అది కాస్త ఆ రోజుల్లో కాంట్రవర్సీ గా మారింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!