తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ పూర్తయింది. త్వరలోనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
టీడీపీ దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మంత్రి తెలిపారు. ఎవరు తప్పు చేసినా వారిపై పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. “పార్టీ అధిష్ఠానానికి అందరూ సమానమే, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కారు” అని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. క్రీడా పరికరాల కొనుగోళ్లు, క్రీడాకారులకు వసతి కల్పించేందుకు కేటాయించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సిద్ధం చేశారు. దానిపై ఆధారంగా త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…