IPL 2024: ఐపీఎల్ 2024 కోసం ఇప్పటికే అన్ని జట్టులో సిద్ధమవుతున్నాయి. అయితే త్వరలోనే ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ లో వేలం జరగనుంది ఈ క్రమంలోనే ప్రపంచ కప్ క్రికెట్లో పెద్ద ఎత్తున పోటీపడి ఆట తీరును కనబరిచిన ఆటగాళ్లపైన ఈసారి ప్రాంచైజీలు పూర్తి దృష్టి పెట్టాయని తెలుస్తుంది. ఈ ఐపీఎల్ కోసం ఈ నెల 19వ తేదీ వేలం జరగబోతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం దుబాయిలో జరగబోయే ఈ వేలం పాటలో పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపించబోతున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా ప్రపంచ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై అందరూ చూపు పడిందని తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ప్రపంచ కప్ పోటీలలో అద్భుతమైన ఆట తీరును కనబరిచారు ఈయన కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సారథ్యంలో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది దీంతో ఈయనపై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించబోతున్నాయని తెలుస్తోంది.
వరల్డ్ కప్ ఆటగాళ్లపై కాసుల వర్షం..
న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రపంచకప్లో టీమిండియా, న్యూజిలాండ్లు 2 సార్లు తలపడ్డాయి. లీగ్ రౌండ్లో న్యూజిలాండ్పై టీమిండియా విజయం సాధించింది. ఈ ఐపీఎల్ వేలంలో డారెల్ మిచెల్ భారీ ధర పలకవచ్చు. వీరితో పాటు గెరాల్డ్ కోయెట్జీ, ట్రావిస్ హెడ్ తదితర ఆటగాళ్ల పై భారీ స్థాయిలోనే ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…