Iron Leg Shasthri : సినిమా రంగంలో అవకాశాలు ఉండి మనకు ఫేమ్ ఉన్నంతవరకే మన చుట్టూ మనుషులు ఉంటారు. అది ఒక్కసారి పోయిందంటే మన చుట్టూ కూడా ఎవరూ ఉండరు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకునేవారు ఉండరు. అందుకే ఆ రంగుల ప్రపంచంలో స్నేహాలు, బంధాలు శాశ్వతం కాదు అలాంటి పరిస్థితే ఐరన్ లెగ్ శాస్త్రి గారి కుటుంబానికి వచ్చింది. ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ అయిపోయిన ఐరన్ లెగ్ శాస్త్రి గారు వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. కానీ అంతే త్వరగా కెరీర్ పడిపోయింది. ఒక్కసారిగా డౌన్ ఫాల్ మొదలయ్యాక ఆర్థికంగా నష్టపోయారు. అవకాశాలు ఓ వైపు లేక ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోడానికి మళ్ళీ పౌరోహిత్యం చేసుకోవాలని సొంతూరు తాడేపల్లి గూడెం వెళ్లిపోయారు. అయితే అప్పటికే మద్యంకి అలవాటు పడిన ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు. అయితే అనారోగ్యానికి గురైనపుడు కానీ ఆయన మరణించక కానీ ఇండస్ట్రీ నుండి ఎటువంటి ఆదరణ, సహాయం అందలేదు. ఇక ఈ విషయాలు చెబుతూ శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అవకాశాలు లేక ఇక సొంతూరు వచ్చేసిన తరువాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఐరన్ లెగ్ శాస్త్రి గారు అక్కడే మరణించారు. ఛాతిలో మంటగా అనిపించి హాస్పిటల్ కి వెళ్లిన ఆయన వెళ్ళేటపుడు అంబులెన్సు లో ఆయనే వెళ్లి కూర్చున్నారట. అక్కడికి వెళ్ళాక కూడా అందరితో జోకులు వేసుకుంటూ సరదాగా ఉన్నారు. కానీ డాక్టర్స్ అప్పటికే మించి పోయింది ఈయన ఎక్కువ కాలం బ్రతకరు అని చెప్పేశారట. ఇక ఐరన్ లెగ్ శాస్త్రి గారి పిల్లలు హైదరాబాద్ లో ఎవరిదో ఫంక్షన్స్ కి వెళ్లగా వాళ్ళ మేనత్త వాళ్ళు ఫోన్ చేసి వచ్చేయమని చెప్పారట.
ఇక రాత్రి వంటి గంట సమయంలో ఐరన్ లెగ్ శాస్త్రి గారు మరణించారు. అంబులెన్సు కూడా లేక రిక్షాలో శవాన్ని ఇంటికి తీసుకోచ్చారట. అవన్నీ తలుచుకుని ఐరన్ లెగ్ శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అలాంటి జీవితం ఎవరికీ రాకూడదు అంటూ చెప్పారు. మరణించక ముందు వరకూ నేను చనిపోతే కుటుంబం పరిస్థితి ఏమిటి అని బాధపడుతూనే ఉండేవారట ఐరన్ లెగ్ శాస్త్రి గారు. ప్రస్తుతం మేనత్త వల్ల బాగా చదువుకుని స్థిరపడ్డారు ప్రసాద్ ఆయన చెల్లి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…