కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.. తాజాగా కొన్ని సడలింపులిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో గత రెండు రోజులుగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇన్నాళ్లు మిస్ అయిన మద్యం కోసం మందుబాబులు ఎగబడిపోయారు. కొన్ని రాష్ట్రాలలో ధరలు విపరీతంగా పెంచినా ఏమాత్రం తగ్గడంలేదు మందుబాబులు. వీటికి సంబంధిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వీడియో కూడా ఒక వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రకుల్ చేతిలో ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్ చూసి ఆమె కూడా మద్యం కొనుక్కుని వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… ముంబై నగరం బాంద్రా లోని ఒక మెడికల్ షాపులో మందులు కొనుక్కొని రోడ్డు దాటుతుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను కొందరు ఆకతాయిలు రకుల్ వైన్ షాపుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసారు. నిజానికి ఆమె కొనుగోలు చేసింది మెడికల్ షాపులోని మందులు ఆ విషయం క్రింది వీడియో చుస్తే తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…