గుండెపోటు అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కొలెస్ట్రాల్, బ్లాక్స్, ఆయిల్ ఫుడ్స్ మాత్రమే. కానీ ఆధునిక వైద్య పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం, గుండె ఆరో్యం కేవలం రక్తనాళాలకే పరిమితం కాదు. మన జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా గట్ హెల్త్ కూడా గుండె పనితీరుపై కీలక ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే గుండె సమస్యల మూలం చాలా సందర్భాల్లో మన పొట్టలోనే మొదలవుతుందన్న మాట.
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్స్, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటోంది. దీని వల్ల శరీరంలో నిశ్శబ్దంగా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ పరిస్థితి మొదట జీర్ణక్రియపై ప్రభావం చూపినా, కాలక్రమేణా రక్తనాళాలు, గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, గుండెపోటు ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. ఏళ్ల తరబడి శరీరంలో పేరుకుపోయే జీవక్రియ లోపాలు, చెడు అలవాట్లు దీనికి కారణమవుతాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఒత్తిడి ఎక్కువగా ఉండే జీవనశైలి గట్లోని మంచి సూక్ష్మజీవులను తగ్గిస్తాయి. దాంతో శరీరంలో వాపు పెరిగి, ధమనుల పనితీరు క్రమంగా దెబ్బతింటుంది.
అలాగే సరైన నిద్ర లేకపోవడం, రోజంతా కూర్చునే అలవాటు, వ్యాయామం లేకపోవడం కూడా గుండె సమస్యలకు పరోక్ష కారణాలుగా మారుతున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, రక్తపోటు మరియు చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ కలిసి గుండెపై అదనపు భారం పెడతాయి.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, గుండెను కాపాడుకోవాలంటే కేవలం కొలెస్ట్రాల్ తగ్గించే మందులపైనే ఆధారపడకూడదు. సహజమైన ఆహారం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజూ కొంతసేపు నడక, వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లు గట్ హెల్త్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శరీరానికి సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించే జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్స్కు దూరంగా ఉండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యం అనేది కేవలం ఒక అవయవానికి సంబంధించిన విషయం కాదు.. మన మొత్తం జీవనశైలికి అద్దం పడే అంశమని వారు గుర్తుచేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…