Balakrishna – Chiranjeevi: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై బాలయ్యతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ కార్యక్రమం నెంబర్ వన్ స్థానంలో కొనసాగిందని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని షో కోసం పని చేస్తున్న బీవీఎస్ రవి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలేదు అనే విషయాన్ని బయటపెట్టారు.
సాధారణంగా చిరంజీవి బాలకృష్ణ మధ్య సినిమాల విషయంలో తీవ్ర స్థాయిలో పోటీ ఉండటం వల్ల వీరిద్దరికి పరస్పర మనస్పర్ధలు ఉండటం చేత ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చాలామంది భావించారు. నిజానికి చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అంటే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమని రవి వెల్లడించారు.
మొదటి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన లేకపోయినప్పటికీ రెండవ సీజన్ లో మాత్రం మెగాస్టార్ తప్పకుండా పాల్గొంటారని అందుకు సంబంధించిన వర్క్ కూడా జరిగిందని బీవీఎస్ రవి వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం నాగార్జునని అడగలేదని ఇక వెంకటేష్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని ఆయన తెలియజేశారు. ఇక సీజన్ 2 ఈ ఏడాది చివరిలో ప్రారంభం కావచ్చని రవి తెలిపారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…