Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఎంతోమందికి జీవితాన్ని అందించిందని చెప్పాలి. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా పలువురికి అవకాశాలు కల్పించి నేడు ఇండస్ట్రీలో వారికి స్టార్ సెలబ్రిటీ హోదాని అందించింది.ఇలా ఎంతోమందికి జీవితాన్ని అందించిన జబర్దస్త్ కార్యక్రమం తాజాగా మరొకరికి అవకాశం కల్పించింది.
తెలుగు తమిళ భాషలలో సుమారు 250కి పైగా సినిమాలలో నటించి లేడీ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి వాసుకి గురించి అందరికీ సుపరిచితమే. వాసుకి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ నటి పాకీజా అంటే మాత్రం అందరికీ టక్కున ఈమె గుర్తుకు వస్తారు.ఇలా ఒకానొక సమయంలో వందల సినిమాలలో నటించిన ఈమెకు ప్రస్తుతం అవకాశాలు లేక ఉన్న ఆస్తిని కోల్పోయి కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నారు.
ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక సతమతమవుతున్న ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన కన్నీటి కష్టాల గురించి తెలియజేయడంతో పలువురు సెలబ్రిటీలు ఈమెను ఆదుకున్నారు. అయితే ఈమె కష్టాలను చూసిన జబర్దస్త్ యాజమాన్యం తనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా నటి పాకీజా సందడి చేశారు.
తనకు పాకీజా గెటప్ ఎంతో మంచి పేరును తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలోకి ఈమె పాకీజా గెటప్ లోనే ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఈమె రైజింగ్ రాజు టీమ్ లో సందడి చేయబోతున్నారు.ఈ కార్యక్రమంలో ఈమెకు అవకాశం రావడంతో ఇక నటి పాకీజా కష్టాలు తీరిపోయినట్లేనని పలువురు భావిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన అవకాశాన్ని ఈమె ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…