Jabardasth: జబర్దస్త్ బూతుల షో.. రామోజీరావు వద్దని చెప్పారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?
Jabardasth: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి విపరీతమైన క్రేజ్ ఉంది.
గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అద్భుతమైన రేటింగ్ సంపాదించుకొని నెంబర్ వన్ కామెడీ షో గా పేరు సంపాదించుకుంది.అయితే ఈ కార్యక్రమాన్ని ఈటీవీలో ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఏమాత్రం ఇష్టం లేదని డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రసారం కాకముందు ఈ టీవీ రేటింగ్ పూర్తిగా పడిపోయింది.
జబర్దస్త్ కార్యక్రమానికి ముందు ఈ టీవీ రేటింగ్ 10 లో ఉండేది. ఈ టీవీ రేటింగ్ పెంచడం కోసం ముందుగా ఢీ షో ప్రసారం చేశారు. అనంతరం జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఇష్టం లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఈ టీవీ రేటింగ్ ఏకంగా రెండవ స్థానానికి చేరుకుంది. రేటింగ్స్ చాలా బాగా రావడంతో రామోజీరావు ఏం చేయలేక ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే జబర్దస్త్ కార్యక్రమం రానురాను కామెడీ షో కాకుండా బూతుల షో అయ్యింది.ఇందులో కమెడియన్స్ పెద్ద ఎత్తున డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా వీరి డైలాగులకు జడ్జిలు వెకిలి నవ్వులు కూడా తోడవ్వడంతో ఈ కార్యక్రమ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధంగా ఈ కార్యక్రమంలో టీవీ రేటింగ్ కూడా పెరగడంతో రామోజీ రావు గారు చేసేదేమీ లేక చేతులెత్తేసారంటూ గీతాకృష్ణ ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…