Jabardasth: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి విపరీతమైన క్రేజ్ ఉంది.

గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అద్భుతమైన రేటింగ్ సంపాదించుకొని నెంబర్ వన్ కామెడీ షో గా పేరు సంపాదించుకుంది.అయితే ఈ కార్యక్రమాన్ని ఈటీవీలో ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఏమాత్రం ఇష్టం లేదని డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రసారం కాకముందు ఈ టీవీ రేటింగ్ పూర్తిగా పడిపోయింది.

జబర్దస్త్ కార్యక్రమానికి ముందు ఈ టీవీ రేటింగ్ 10 లో ఉండేది. ఈ టీవీ రేటింగ్ పెంచడం కోసం ముందుగా ఢీ షో ప్రసారం చేశారు. అనంతరం జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఇష్టం లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఈ టీవీ రేటింగ్ ఏకంగా రెండవ స్థానానికి చేరుకుంది. రేటింగ్స్ చాలా బాగా రావడంతో రామోజీరావు ఏం చేయలేక ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
డబుల్ మీనింగ్ డైలాగులతో …
అయితే జబర్దస్త్ కార్యక్రమం రానురాను కామెడీ షో కాకుండా బూతుల షో అయ్యింది.ఇందులో కమెడియన్స్ పెద్ద ఎత్తున డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా వీరి డైలాగులకు జడ్జిలు వెకిలి నవ్వులు కూడా తోడవ్వడంతో ఈ కార్యక్రమ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధంగా ఈ కార్యక్రమంలో టీవీ రేటింగ్ కూడా పెరగడంతో రామోజీ రావు గారు చేసేదేమీ లేక చేతులెత్తేసారంటూ గీతాకృష్ణ ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.






























