బుల్లితెరపై పలు ఛానల్స్ లో పండుగ సమయాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో వినాయకచవితి పండుగ వస్తున్న సందర్భంగా ఈటీవీ “ఊరిలో వినాయకుడు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ జడ్జి రోజా, ఇంద్రజ పాల్గొని ఎంతో సందడి చేశారు.
ఈ విధమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో నటీనటులకు టాస్క్ లు ఇవ్వడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యూటీ వర్షకి ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రాంప్రసాద్ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా వారు బయటకు వెళ్లి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. కానీ ఆమెను ఎవరు గుర్తు పట్టకూడదు అనే కండిషన్ పెడతాడు.
ఈ టాస్క్ లో భాగంగా వర్ష పిచ్చిదాని వేషంలో రోడ్డు పైకి వెళుతుంది. ఆమె రోడ్డుపై వెళ్తున్న కుర్రాళ్ళకు ప్రపోస్ చేయగా,ఆ ప్రపోజల్ ను చెడకొడుతూ ఉంటాడు ఇమ్మానియేల్ ఈ విధంగా వీరిద్దరూ రోడ్డుపై యాచకులుగా జనాల దగ్గరికి వెళ్తే వారు భయపడుతూ పరుగులు పెడుతుంటారు. ఈ సంఘటనలు చూసి రోజా ఇంద్రజ ఎంతో నవ్వుకుంటారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రమోషన్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో అందంగా ఉన్న వర్ష ఈ విధంగా యాచకురాలుగా మారడంతో ఆమె ఎవరు గుర్తు పట్టలేకపోయారు. ఈ విధంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన టాస్క్ లో వర్ష విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…