బుల్లితెరపై పలు ఛానల్స్ లో పండుగ సమయాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో వినాయకచవితి పండుగ వస్తున్న సందర్భంగా ఈటీవీ “ఊరిలో వినాయకుడు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ జడ్జి రోజా, ఇంద్రజ పాల్గొని ఎంతో సందడి చేశారు.

ఈ విధమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో నటీనటులకు టాస్క్ లు ఇవ్వడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యూటీ వర్షకి ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రాంప్రసాద్ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా వారు బయటకు వెళ్లి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. కానీ ఆమెను ఎవరు గుర్తు పట్టకూడదు అనే కండిషన్ పెడతాడు.
ఈ టాస్క్ లో భాగంగా వర్ష పిచ్చిదాని వేషంలో రోడ్డు పైకి వెళుతుంది. ఆమె రోడ్డుపై వెళ్తున్న కుర్రాళ్ళకు ప్రపోస్ చేయగా,ఆ ప్రపోజల్ ను చెడకొడుతూ ఉంటాడు ఇమ్మానియేల్ ఈ విధంగా వీరిద్దరూ రోడ్డుపై యాచకులుగా జనాల దగ్గరికి వెళ్తే వారు భయపడుతూ పరుగులు పెడుతుంటారు. ఈ సంఘటనలు చూసి రోజా ఇంద్రజ ఎంతో నవ్వుకుంటారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రమోషన్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో అందంగా ఉన్న వర్ష ఈ విధంగా యాచకురాలుగా మారడంతో ఆమె ఎవరు గుర్తు పట్టలేకపోయారు. ఈ విధంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన టాస్క్ లో వర్ష విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

































