Jackie Shroff: సాధారణంగా స్నేహితులందరూ అప్పుడప్పుడు ఒకే చోట సరదాగా కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మన సౌత్ ఇండస్ట్రీలో కూడా అలనాటి స్టార్ హీరో హీరోయిన్లు అందరూ ఏడాదికి ఒకసారి ఒకచోట చేరి సందడి చేస్తూ ఉంటారు. 80వ శతాబ్దంలో సినిమా ఇండస్ట్రీలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన ఎంతోమంది సెలబ్రిటీలు ఏడాదికి ఒకసారి అందరూ ఒకే చోట కలుసుకొని సంతోషంగా ఎంజాయ్ చేస్తారు.
తాజాగా ముంబైలో నిర్వహించిన ఈ యూనియన్ పార్టీల అలనాటి సినీ తారలందరూ కలిసి సందడి చేశారు. బాలీవుడ్ నటుడు జాపీ ష్రాఫ్ ఇచ్చిన రీయూనియన్ పార్టీలో సౌత్ ఇండియన్ సెలబ్రిటీలతో పాటు నార్త్ ఇండియన్ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. జాపీ ష్రాఫ్ ఇచ్చిన ఈ ఆతిథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, వికె నరేష్ తో పాటు భానుచందర్, రమ్యకృష్ణ, సుహాసిని, శోభన, రాధ, జయప్రద, విద్యాబాలన్, నదియా, అర్జున్, శరత్ కుమార్, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు.
ఇలా వీరందరూ ఒకే చోట చేరి అలనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఈ సీనియర్ సెలబ్రిటీల రీ యూనియన్ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రతి ఏడాది ఎక్కడ ఒకచోట కలుసుకుంటూ ఆనందంగా ఎంజాయ్ చేశారు.
ఈ సెలబ్రిటీలందరూ ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మంచి మంచి పాత్రలలో నటిస్తూ మరికొందరు నిర్మాతలుగా కూడా మారారు.
ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…