Featured

Jaya Prakash Narayan : వెంకయ్య నాయుడుని రాష్ట్రపతి చేయకపోవడానికి కారణాలు ఇవే…!

Jaya Prakash Narayan : ఇండియా ప్రజాస్వామిక దేశం, ప్రజలకు నచ్చిన వాళ్ళను ఎంచుకుని పాలనా పగ్గాలను అందిస్తారు. ఇక రాష్ట్రపతిని మాత్రం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్షంగా ఎన్నుకుంటాం. అంటే మనం ప్రత్యక్షంగా ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ఎన్నుకుంటారు. అంటే మనం పరోక్షంగా మనం రాష్ట్రపతిని నిర్ణయిస్తాము. ఇక రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తికని ఎన్నుకోవటం సంప్రదాయం. అలా రాజకీయాల్లో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న వాళ్లను దేశం మొదటి పౌరుడిగా ఎన్నుకోవటం జరుగుతోంది.

వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి కాకపోవడానికి కారణం అదే…

ఇక మన తెలుగు వ్యక్తి, నెల్లూరుకి చెందిన వెంకయ్యనాయుడు మన దేశానికి ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక మన దేశంలో చాలాసార్లు ఉపరాష్ట్రపతి ఆ తరువాత కాలంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలా వెంకయ్య గారు కూడా రాష్ట్రపతి అవుతారని అందరూ భావించారు. తెలుగు వారైతే బాగా ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు అడియాసలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ద్రౌపది మూర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇక అధికారంలో ప్రస్తుతం ఉన్న పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ కాబట్టి ద్రౌపది మూర్ము రాష్ట్రపతి అయ్యే అవకాశం ఎక్కువ.

ఇక వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని చేయకపోడానికి గల కారణాలను జయప్రకాష్ గారు విశ్లేషించారు. మోదీ ఎపుడు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు ఆయన కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అలా ఆలోచిస్తారు. రామ్ నాధ్ కోవింద్ గారిని ఇప్పుడు ద్రౌపది మూర్ము ని అలాగే ఎంపిక చేసారు. ద్రౌపది మూర్ము గిరిజన ఆదివాసి జాతికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు గుర్తింపునిచ్చారు మోదీ అని చెప్పారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago