Jaya Prakash Narayan : ఇండియా ప్రజాస్వామిక దేశం, ప్రజలకు నచ్చిన వాళ్ళను ఎంచుకుని పాలనా పగ్గాలను అందిస్తారు. ఇక రాష్ట్రపతిని మాత్రం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్షంగా ఎన్నుకుంటాం. అంటే మనం ప్రత్యక్షంగా ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ఎన్నుకుంటారు. అంటే మనం పరోక్షంగా మనం రాష్ట్రపతిని నిర్ణయిస్తాము. ఇక రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తికని ఎన్నుకోవటం సంప్రదాయం. అలా రాజకీయాల్లో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న వాళ్లను దేశం మొదటి పౌరుడిగా ఎన్నుకోవటం జరుగుతోంది.

వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి కాకపోవడానికి కారణం అదే…
ఇక మన తెలుగు వ్యక్తి, నెల్లూరుకి చెందిన వెంకయ్యనాయుడు మన దేశానికి ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక మన దేశంలో చాలాసార్లు ఉపరాష్ట్రపతి ఆ తరువాత కాలంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలా వెంకయ్య గారు కూడా రాష్ట్రపతి అవుతారని అందరూ భావించారు. తెలుగు వారైతే బాగా ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు అడియాసలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ద్రౌపది మూర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇక అధికారంలో ప్రస్తుతం ఉన్న పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ కాబట్టి ద్రౌపది మూర్ము రాష్ట్రపతి అయ్యే అవకాశం ఎక్కువ.

ఇక వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని చేయకపోడానికి గల కారణాలను జయప్రకాష్ గారు విశ్లేషించారు. మోదీ ఎపుడు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు ఆయన కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అలా ఆలోచిస్తారు. రామ్ నాధ్ కోవింద్ గారిని ఇప్పుడు ద్రౌపది మూర్ము ని అలాగే ఎంపిక చేసారు. ద్రౌపది మూర్ము గిరిజన ఆదివాసి జాతికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు గుర్తింపునిచ్చారు మోదీ అని చెప్పారు.


































