Journalist Prabhu : ఆదివారం నాడు రాకేష్ మాస్టర్ కన్నుమూసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఆయన గురించి కథనాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆయన మరణించాకే ఆయన ఎంత గొప్ప మాస్టర్ అనే విషయం చాలా మందికి తెలిసింది. సుమారు 1500 కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసిన ఆయన ఎంతో మంది స్టార్లతో కలిసి పనిచేసిన మేటి టెక్నీషియన్. కానీ ఆయన జీవితాన్ని ఆయనే చెజేతులా పాడు చేసుకుని చివరకు ఇలా మరణించారంటూ ఆయన గురించి ఆయన శిష్యులు, అభిమానులు అలాగే సినిమా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక రాకేష్ మాస్టర్ జీవితం గురించి జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు.
ఆయన వెలుగును ఆయనే అర్పేసుకున్నారు…
రాకేష్ మాస్టర్ ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేద కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న వ్యక్తి అంటూ ప్రభు తెలిపారు. తిరుపతి లో ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా డాన్స్ మీద ఇష్టంతో చెన్నై వెళ్లి ముక్కురాజు మాస్టర్ వద్ద మెలకువలు నేర్చుకుని మాస్టర్ గా ఎదిగాడు. అయితే తన ముక్కుసూటి తనం వల్లే చాలా సార్లు ఇబ్బందులను ఎదుర్కొన్న రాకేష్ మాస్టర్ తన ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ పోగొట్టుకోడానికి మద్యానికి అలవాటు పడి చివరకు వ్యసనంగా మార్చుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంటూ తెలిపారు.
తన కెరీర్ లో అత్యున్నత స్థాయి చూసిన రాకేష్ మాస్టర్ తన వెలుగును తానే ఆర్పేసుకున్నాడు అంటూ చెప్పారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానెల్ ద్వారా నోటికి వచ్చినట్లు కొంత మందిని తిట్టడం వంటివి చేసి మరింత పలుచన అయ్యాడు అంటూ ప్రభు అభిప్రాయపడ్డారు. అయితే రాకేష్ మాస్టర్ తనకు డబ్బు ఉన్న రోజున సహాయం చేసాడు. అలాగే తన దగ్గర పెద్దగా డబ్బు లేనపుడు కూడా సాయం చేసాడు అంటూ ప్రభు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…