Jr.NTR: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఉత్తమ బాల నటుడిగా అవార్డు తీసుకున్నారు. బాలనటుడిగా మెప్పించి 17 సంవత్సరాలకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈయన హీరోగా మొదటిసారిగా నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో నటించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఈ సినిమా నుంచి వెనుతిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తన మొదటి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు గాను అక్షరాల 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.17 సంవత్సరాల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి.ఈ విధంగా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న ఎన్టీఆర్ ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఆ డబ్బు తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…