NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రాపర్టీ విషయంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ విషయంలో వివాదాలు రావడంతో కోర్టులో ఈ వివాదానికి పరిష్కారం కోసం పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.
ఈ విధంగా ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి ఈ స్థలాన్ని సుంకు గీత 1996లోనే బ్యాంకులో తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం పొందింది. ఇలా తీసుకున్న రుణాలను కట్టకుండా ఎగ్గొట్టారు.దాంతో ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్స్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి.
ఈ విషయంపై విచారణ జరిపినటువంటి డీఆర్టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని వెల్లడించారు. ఈ విధమైనటువంటి తీర్పు రావడంతో ఎన్టీఆర్ ఆ స్థలం కోల్పోవడమే కాకుండా ఆ స్థలంలో కట్టినటువంటి ఇల్లును కూడా కోల్పోయే పరిస్థితిలు ఏర్పడ్డాయి దీంతో ఆయన ఈ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోట్ల విలువ..
ఈ వివాదాన్ని పరిశీలిస్తే ఎన్టీఆర్ సుంకు గీత అనే మహిళ చేతిలో ఘోరంగా మోసపోయారని తెలుస్తుంది. ఈ ప్రాపర్టీ విలువ కొన్ని కోట్లలో ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ ప్రాపర్టీని తన సొంతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…