Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన నేడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గతంలో పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన తల్లి గురించి పలు విషయాలు వెల్లడించారు. చిన్నప్పుడు తను బాగా అల్లరి చేసేవాన్ని అయితే అమ్మ చాలా సహనంతో భరించేదని తెలిపారు. ఇక నా అల్లరితో ఓపిక నశించిపోయిన అమ్మ తనని బాగా కొట్టేదని కూడా తెలిపారు.
అమ్మకు నేనంటే చాలా ప్రాణం కానీ తనను ఎప్పుడు గారాబం చేయలేదని తెలిపారు. అమ్మ అలా ప్రవర్తించడం వల్లే నేను వాస్తవంలో బ్రతకడం నేర్చుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు. అమ్మే నా బలగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈయన 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.ఈ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ క్షేమంగా బ్రతికి బయటపడ్డారు. ఇలా ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈయన ఇప్పటికీ ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక తన భార్య గురించి కూడా మాట్లాడుతూ లక్ష్మీ ప్రణతి తనకు భార్యగా రావడం తన అదృష్టం అని తెలిపారు. అయితే తనకు ఇద్దరు కుమారులు కాగా కూతురు లేని లోటు అలాగే ఉండిపోయిందని ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…