Junior Srihari : గత ఆదివారం నాడు రక్తపు వాంతులు, విరేచనాలతో రాకేష్ మాస్టర్ గాంధీ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనది సహజ మరణం అని అందరూ భావించినా, తాగుడు ఎక్కువై ఆరోగ్యం పాడై పోయి మనిషి చనిపోయాడని అందరూ భావించినా ఆయన దగ్గరున్న వాళ్ళు ఆయన శిష్యులు మాత్రం ఆయనది సహజ మరణం కాదు, ఎవరో చనిపోయేలాగా కొట్టారు అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ కు సన్నిహితుడైన జూనియర్ శ్రీహరి అలియాస్ హేమంత్ అనే వ్యక్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ మరణం గురించి మాట్లాడారు.

బాగా తాగారు… స్వాతి నాయుడు వల్ల గొడవ…
విజయనగరంలో ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం షూటింగ్ కి వెళ్లిన రాకేష్ మాస్టర్ గారితో పాటు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన చాలా మంది ఉన్నారు, అందులో జూనియర్ శ్రీహరిగా పిలవబడే హేమంత్ అలాగే పుల్లయ్య, వైజాగ్ దయ వంటి వారు ఉండగా మాస్టర్ గారితోనే జూనియర్ శ్రీహరి ఉన్నారట. అయితే షూటింగ్ అయ్యాక రిసార్ట్స్ లో ఉన్నపుడు అర్ధరాత్రి కొంతమంది వచ్చి మాస్టర్ తో ఫోటో తీయించుకోవాలని అడిగి అయ్యాక స్వాతి నాయుడు ను పిలవాలని అనడం, ఈ టైములో కాదు పొద్దున్నే రండి అని చెప్పడంతో గొడవ జరిజి అప్పటికే అందరూ తాగి ఉండటం వల్ల ఇరువైపులా గొడవ పడ్డారట.

అయితే ఆ సమయంలో రాకేష్ మాస్టర్ మీద ఎలాంటి దెబ్బ పడలేదని జూనియర్ శ్రీహరి తెలిపారు. అయితే మందు మాత్రం ఎక్కువగా ఆ పది రోజులు తీసుకున్నారని అప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదు. మరో రెండు నెలలే ఆయన బ్రతుకుతారు అనే విషయం అప్పటికే ఆయనకు తెలుసు కానీ మాకెవరికీ చెప్పలేదు అంటూ జూనియర్ శ్రీహరి తెలిపారు. ఇక అక్కడ షూటింగ్ అపుడు సునిశిత్ కోసం కూడా గొడవ జరిగింది. వాటిలో రాకేష్ మాస్టర్ గాయపడింది లేదు. హైదరాబాద్ వచ్చేటపుడు ఆయన బాగానే ఉన్నారు అంటూ చెప్పారు జూనియర్ శ్రీహరి. ఇక రూమ్ కి వచ్చాక ఏం జరిగిందో తెలియదు. ఆయన ఫోన్ పోవడం నిజం కానీ ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు అనుకుంటున్నాం అని జూనియర్ శ్రీహరి తెలిపారు.




























