Kantara Movie: కాంతార ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరే వినబడుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే ఇలా దేవుళ్ళ ఆత్మతో మాట్లాడేవారు ఉంటారా వారు చెప్పినవే జరుగుతాయా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటుంది.
నిజానికి రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో గత కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. కర్ణాటకలోని బంట్ అనే తెగవారు నివసించేవారు. వీరి భాష తులు. అయితే ప్రస్తుతం ఈ తెగ వారందరూ కూడా వివిధ రకాలుగా విడిపోయి మతాలు మార్చుకున్న వారు ఉన్నారు అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుష్క శెట్టి, కృతి శెట్టి, రిషబ్ శెట్టి, నేహా శెట్టి, రక్షిత్ శెట్టి, శిల్పా శెట్టి శ్రీనిధి శెట్టి ఇలా వీరందరి పూర్వీకులు కూడా ఇదే తెగకు చెందిన వారే.
ఈ విధంగా ప్రస్తుత కాలంలో ఈ తెగకు చెందినవారు వివిధ ప్రాంతాలలో ఉండే మతాలు మార్చుకున్నప్పటికీ వీరందరూ కలిసి ఇప్పటికీ ఎంతో నమ్మకంగా “కంబళ” అనే నృత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ నృత్యాన్ని మనం కాంతార సినిమాలో చూసాము. ఈ తెగకు చెందినవారు ఈ డాన్స్ చేస్తూ వారి కులదైవాన్ని పూజించడం వల్ల వారి కుటుంబంలో మరణించిన పూర్వీకుల ఆత్మ వారిని ఆవహించి జరగబోయేది చెబుతారని అలాగే ఆ కుటుంబ సభ్యులకు దిశా నిర్దేశం చేస్తారని భావిస్తారు.
ఈ విధంగా రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో మూడు దశాబ్దల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దారు అయితే ఈ సినిమాలో చూపించినది మొత్తం నిజ సంఘటన ఆధారంగా మాత్రమే జరిగినదని నిజంగానే ఆ తెగ వారికి ఆత్మలు ఆవహిస్తాయని ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి అంతరించిపోతున్న వారి కలను బయటకు పెట్టారు. ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం అన్ని భాషలలోనూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…