Kantara Movie: ప్రస్తుతం ఏ భాషలో చూసినా కాంతారావు సినిమా పేరు మారుమోగిపోతుంది.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కన్నడ భాషలో విపరీతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ క్రమంలోనే కాంతార సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా నిజ జీవిత ఆధారంగా రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, ప్రభాస్ కార్తీ, వర్మ, ధనుష్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఇకపోతే ఈ సినిమాపై ఇంతవరకు కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలోనే కన్నడ ప్రేక్షకులు పెద్ద ఎత్తున రష్మికపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టి. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా తనని ఇండస్ట్రీకి పరిచయం చేసి అద్భుతమైన హిట్ అందించిన దర్శకుడు సినిమా నేడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ సినిమాపై కనీసం స్పందించే తీరిక కూడా రష్మికకు లేకుండా పోయిందా.. నేడు రష్మిక ఈ స్థాయిలో ఉందంటే అందుకు గల కారణం రిషబ్ శెట్టి అని చెప్పాలి.అలాంటి విజయాన్ని అందించిన రిషబ్ శెట్టి సినిమాపై రష్మిక స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రష్మిక స్పందిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…