Karate Kalyani: సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నంది అవార్డుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
చిత్ర పరిశ్రమలో కళాకారులకు ఇకపై నంది అవార్డులు కాకుండా గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇలా గద్దర్ పేరిట వచ్చే ఏడాది ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రముఖ నంది అవార్డుల పేరును మార్చడంతో కరాటే కళ్యాణి ఫేస్బుక్ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గాడ్సే అవార్డులు ఇస్తాను…
గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఇబ్బందే అయినా.. అది మీ ఇష్టం. తప్పేమీ లేదు కానీ.. అత్యుత్తమమైన నంది అవార్డుల పేరు మారిస్తే ఏ సీఎం అయినా తప్పే.. నంది చూసుకుంటాడులే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా తాను గాడ్సే అవార్డులు కూడా ఇస్తానని అందుకోవాల్సిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటూ ఈమె పరోక్షంగా గద్దర్ ను అవమానిస్తూ కూడా చేసినటువంటి ఈ కామెంట్లు సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…