Karate Kalyani: సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నంది అవార్డుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
చిత్ర పరిశ్రమలో కళాకారులకు ఇకపై నంది అవార్డులు కాకుండా గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇలా గద్దర్ పేరిట వచ్చే ఏడాది ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రముఖ నంది అవార్డుల పేరును మార్చడంతో కరాటే కళ్యాణి ఫేస్బుక్ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గాడ్సే అవార్డులు ఇస్తాను…
గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఇబ్బందే అయినా.. అది మీ ఇష్టం. తప్పేమీ లేదు కానీ.. అత్యుత్తమమైన నంది అవార్డుల పేరు మారిస్తే ఏ సీఎం అయినా తప్పే.. నంది చూసుకుంటాడులే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా తాను గాడ్సే అవార్డులు కూడా ఇస్తానని అందుకోవాల్సిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటూ ఈమె పరోక్షంగా గద్దర్ ను అవమానిస్తూ కూడా చేసినటువంటి ఈ కామెంట్లు సంచలనంగా మారాయి.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…