Featured

నేటి నుంచే కొత్తచట్టం అమలు.. ఆవును చంపితే జైలుకే..?

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గోవధ నివారణ, సంరక్షణ చట్టం ఈరోజు నుంచి కర్ణాటక రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. కొత్త చట్టం అమలులోకి రావడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఎవరైనా ఆవును చంపితే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్ నెలలో కర్ణాటక రాష్ట్రంలో ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. స్లాటర్ ప్రొటెక్షన్ అండ్ పశువుల సంరక్షణ బిల్లు -2020 పేరుతో ఈ చట్టం అమలులోకి వచ్చింది.

కొత్త చట్టం ప్రకారం 13 సంవత్సరాల లోపు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను చంపడానికి వీలు లేదు. 13 సంవత్సారాల పై బడిన ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను చంపే అవకాశం ఉన్నా పశు వైద్యులు అనారోగ్యం పాలైతే లేదా పరిశోధనల కొరకు అవసరమైతే మాత్రమే వాటిని చంపడానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు పశువులను తరలించడాన్ని కూడా ఈ చట్టం కింద నేరంగానే పరిగణిస్తారు.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం జరిమానా చెల్లించడంతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే గోవధకు పాల్పడతారో వారికి 50,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని సంతల్లో సైతం వధించడానికి పశువులను అమ్మడానికి వీలు లేదు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉండగా కర్ణాటక రాష్ట్రం కూడా ఈ చట్టం అమలు దిశగా అడుగులు వేయడం గమనార్హం. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే జంతువులపై క్రూరత్వ నియంత్రణ చట్టంలో భాగంగా కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

1 hour ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago