సాధారణంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధన చేస్తుంటాము. అయితే ఈ దీపారాధన చేయడానికి కొంతమంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. మరికొంతమంది కంచు, ఇత్తడితో తయారు చేసిన ప్రమిదలను వెలిగించి దీపారాధన చేస్తుంటారు. ఆర్థికంగా ఎంతో స్తోమత కలిగిన వారు దేవుని ముందు దీపారాధన చేయడానికి వెండి ప్రమిదలను వెలిగిస్తారు. ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు దీపాలను వెలిగించి దేవుడికి పూజ చేస్తుంటారు. అయితే వెండి దీపాలను ఏ దేవుడి ముందు వెలిగించాలో తెలుసా? ఈ విధంగా వెండి దీపాలను వెలిగించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
వెండి ప్రమిదలో నెయ్యిని వేసి వినాయకుడు ముందు దీపారాధన చేయటం వల్ల మనం చేసే పనులలో ఏ ఆటంకం లేకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగించడం ద్వారా జ్ఞానం ప్రసాదిస్తుంది. వెండి ప్రమిదలలో నెయ్యిని వేసి శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మంగళవారం కుజగ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. మంచి బుద్ధి కలగాలంటే బుధవారం బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగించాలి. అదేవిధంగా శనివారం వెండి ప్రమిదలో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది. ఈ విధంగా వెండి దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…