సాధారణంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధన చేస్తుంటాము. అయితే ఈ దీపారాధన చేయడానికి కొంతమంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. మరికొంతమంది కంచు, ఇత్తడితో తయారు చేసిన ప్రమిదలను వెలిగించి దీపారాధన చేస్తుంటారు. ఆర్థికంగా ఎంతో స్తోమత కలిగిన వారు దేవుని ముందు దీపారాధన చేయడానికి వెండి ప్రమిదలను వెలిగిస్తారు. ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు దీపాలను వెలిగించి దేవుడికి పూజ చేస్తుంటారు. అయితే వెండి దీపాలను ఏ దేవుడి ముందు వెలిగించాలో తెలుసా? ఈ విధంగా వెండి దీపాలను వెలిగించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
వెండి ప్రమిదలో నెయ్యిని వేసి వినాయకుడు ముందు దీపారాధన చేయటం వల్ల మనం చేసే పనులలో ఏ ఆటంకం లేకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగించడం ద్వారా జ్ఞానం ప్రసాదిస్తుంది. వెండి ప్రమిదలలో నెయ్యిని వేసి శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మంగళవారం కుజగ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. మంచి బుద్ధి కలగాలంటే బుధవారం బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగించాలి. అదేవిధంగా శనివారం వెండి ప్రమిదలో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది. ఈ విధంగా వెండి దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…