Yediyurappa Granddaughter Dead: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవరాలు సౌందర్య (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య మృతి చెందడంతో యడియూరప్ప ఇంటిలో విషాదం చోటు చేసుకుంది.
బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
సౌందర్య యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అని తెలుస్తోంది. పద్మావతి రాష్ట్ర రాజకీయాలలో లేకపోవటంవల్ల ఈమె గురించి పెద్దగా పరిచయం లేదు. సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు. ఈమె బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది.
సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో ఆమె 2018లో తన తోటి డాక్టర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఇలా సౌందర్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈమె మరణించడంతో ఈమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బౌరింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…