Yediyurappa Granddaughter Dead: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవరాలు సౌందర్య (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య మృతి చెందడంతో యడియూరప్ప ఇంటిలో విషాదం చోటు చేసుకుంది.
బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
సౌందర్య యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అని తెలుస్తోంది. పద్మావతి రాష్ట్ర రాజకీయాలలో లేకపోవటంవల్ల ఈమె గురించి పెద్దగా పరిచయం లేదు. సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు. ఈమె బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది.
సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో ఆమె 2018లో తన తోటి డాక్టర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఇలా సౌందర్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈమె మరణించడంతో ఈమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బౌరింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…