Yediyurappa Granddaughter Dead: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవరాలు సౌందర్య (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య మృతి చెందడంతో యడియూరప్ప ఇంటిలో విషాదం చోటు చేసుకుంది.
బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
సౌందర్య యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అని తెలుస్తోంది. పద్మావతి రాష్ట్ర రాజకీయాలలో లేకపోవటంవల్ల ఈమె గురించి పెద్దగా పరిచయం లేదు. సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు. ఈమె బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది.
సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో ఆమె 2018లో తన తోటి డాక్టర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఇలా సౌందర్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈమె మరణించడంతో ఈమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బౌరింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…