Karun Nair missed a chance that came after eight years
ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత టెస్టు జట్టులో ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. రాక రాక అవకాశం వస్తే.. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి డకౌట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. హెడింగ్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో, బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్ అందించిన క్యాచ్కు కరుణ్ బలయ్యాడు. ఇప్పుడు ఇదే నెటిజన్ల ట్రోల్స్కు బీజం వేసింది.
శుభ్మన్ గిల్ (147) ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్, అప్పటికే భారత స్కోరు 430/4గా ఉండడంతో ఒత్తిడి లేకుండా, స్థిరంగా ఆడే అవకాశం అతనికి లభించింది. కానీ అనవసరమైన షాట్కు ప్రయత్నించి, తాను సాధించవచ్చిన అవకాశాన్ని చేతులారా వదులుకున్నాడు. ఇదే సమయంలో పంత్ గ్రౌండ్లో దూకుడుగా ఆడుతుండగా, కరుణ్ మాత్రం తక్కువ సమయం ఉండగానే పెవిలియన్ వెనుతిరిగాడు.
ఈ పరాభవంతో రెండో ఇన్నింగ్స్కు భారత్ బాటింగ్ చేయకపోతే, నాయర్ మరోసారి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే జట్టులో అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లు తమ చాన్స్ కోసం ఎదురు చూస్తుండటంతో, కరుణ్ స్థానం మరింత ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ట్వీట్ వైరల్ అవుతోంది: “ఓర్నీ ఎనిమిదేళ్ల తర్వాత అవకాశం వస్తే ఇలాగానా ఆడతావా..? ఇంకెవరైనా ఆ ఛాన్స్కి తగిన న్యాయం చేశారు” అని చెప్పాడు.. ఈ ట్వీట్ కి భారీ పెద్ద ఎత్తున స్పందన వస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…