Karun Nair missed a chance that came after eight years
ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత టెస్టు జట్టులో ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. రాక రాక అవకాశం వస్తే.. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి డకౌట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. హెడింగ్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో, బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్ అందించిన క్యాచ్కు కరుణ్ బలయ్యాడు. ఇప్పుడు ఇదే నెటిజన్ల ట్రోల్స్కు బీజం వేసింది.
శుభ్మన్ గిల్ (147) ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్, అప్పటికే భారత స్కోరు 430/4గా ఉండడంతో ఒత్తిడి లేకుండా, స్థిరంగా ఆడే అవకాశం అతనికి లభించింది. కానీ అనవసరమైన షాట్కు ప్రయత్నించి, తాను సాధించవచ్చిన అవకాశాన్ని చేతులారా వదులుకున్నాడు. ఇదే సమయంలో పంత్ గ్రౌండ్లో దూకుడుగా ఆడుతుండగా, కరుణ్ మాత్రం తక్కువ సమయం ఉండగానే పెవిలియన్ వెనుతిరిగాడు.
ఈ పరాభవంతో రెండో ఇన్నింగ్స్కు భారత్ బాటింగ్ చేయకపోతే, నాయర్ మరోసారి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే జట్టులో అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లు తమ చాన్స్ కోసం ఎదురు చూస్తుండటంతో, కరుణ్ స్థానం మరింత ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ట్వీట్ వైరల్ అవుతోంది: “ఓర్నీ ఎనిమిదేళ్ల తర్వాత అవకాశం వస్తే ఇలాగానా ఆడతావా..? ఇంకెవరైనా ఆ ఛాన్స్కి తగిన న్యాయం చేశారు” అని చెప్పాడు.. ఈ ట్వీట్ కి భారీ పెద్ద ఎత్తున స్పందన వస్తుంది.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…