Katrina Kaif: ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టడమే కాకుండా వెంటనే పిల్లలను కూడా ప్లాన్ చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియా భట్ ఒకే ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం కూడా జరిగింది. ఇక నయనతార కూడా పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.
ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కూడా కంటున్నారు. అయితే తాజాగా మరొకటి కూడా త్వరలోనే తల్లి కాబోతుందని వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి కత్రినా కైఫ్ నటుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు.
వీరి వివాహం రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్లోని ఒక ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగి ఏడాది పూర్తి అయినప్పటికీ ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఏ విషయం ప్రకటించకపోయినా ప్రస్తుతం ఈమె మాత్రం ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈ విషయాన్ని తెలియజేయకుండా దాచేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
తాజాగా కత్రినా కైఫ్ ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేశారు. అయితే ఈమె చాలా వదులుగా ఉన్న దుస్తులను ధరించారు. ఇలా వదులుగా ఉన్న దుస్తులను ధరించినప్పటికీ తన పొట్ట చాలా క్లియర్ గా కనిపించడంతో ఈమె గర్భం దాల్చిందని అయితే తన ప్రేగ్నెన్సీ విషయం బయటపడకుండా ఉండడం కోసమే ఇలా వదులుగా ఉన్న దుస్తులను ధరించింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే మరి నిజంగానే కత్రినా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాస్తుందా లేక తను ప్రెగ్నెంట్ కాదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…