దేశంలో మద్యం ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే ఎక్కువ మొత్తంలో లైసెన్స్ లేకుండా మద్యం నిల్వ ఉంచుకున్నా ఇబ్బందులు పడక తప్పదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం కొనుగోలు చేసి ఇంట్లో దాచుకునే వారికి భారీ షాక్ ఇచ్చింది.
ఎక్సైజ్ శాఖ నిబంధనలలో కీలక సవరణలు చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం రవాణా చేయడానికి, కొనుగోలు చేయడానికి వీలు లేదు. నూతన మార్గదర్శకాల ప్రకారం కేవలం ఆరు లీటర్ల మద్యానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆరు లీటర్ల కంటే ఎక్కువ మొత్తం మద్యం నిల్వ చేయాలని అనుకుంటే మాత్రం లైసెన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎవరైనా ప్రభుత్వ లైసెన్స్ ను పొందాలని భావిస్తే వారు 51 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడంతో పాటు 12 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంతో పోలిస్తే రిటైలర్స్ కు కూడా 7.5 శాతం లైసెన్స్ ఫీజును పెంచింది. అదే సమయంలో బీరుపై గతంతో ఉన్న సుకంతో పోలిస్తే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. తక్కువ ఆల్కహాల్ పానీయాలను ప్రోత్సహించే దిశగా యూపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
గతేడాది లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల ఆదాయం తగ్గిన నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్త్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లతో వైన్ తయారు చేసేవారికి ఐదు సంవత్సరాల పాటు ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…