తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో లైనా మెగా రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్ లు చిత్ర బృందం విడుదల చేశారు.అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆతృతతో అటు మెగా అభిమానులు,ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరి అభిమానులకు చిత్రబృందం శుభవార్తను తెలియజేసింది.
ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా, కొమరం భీమ్ (ఎన్టీఆర్) బుల్లెట్ నడుపుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బామ అలియా భట్ సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అదేవిధంగా కొమరం భీమ్ పాత్రలో పోషిస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్టు డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…