టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయి ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కొందరు టిక్ టాక్ స్టార్ లు ఇప్పటికీ అదే రేంజ్ ను కంటిన్యూ చేస్తూ యూట్యూబ్ చానల్స్ ద్వారా వినోదాన్ని పంచుతారు.కొందరికి బుల్లితెరపై నటించే అవకాశం రాగా దుర్గారావు లాంటి వారికి ఏకంగా సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇందులో భాగంగానే టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన షేక్ రఫీ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.
నెల్లూరు లో కెమెరామెన్ గా పనిచేస్తున్న షేక్ రఫీ అక్కడి నుంచి రోజుకు పదుల సంఖ్యలో టిక్ టాక్ ద్వారా వీడియోలను అప్లోడ్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇంత ఫాలోవర్స్ ఉన్న రఫీ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. రఫీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఓ అమ్మాయని తెలుస్తోంది. రఫీ స్నేహితుడైన ముస్తఫాతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే ముస్తఫా ఒక అమ్మాయితో ఎంతో చనువుగా వుండే వాడు. కానీ ఆ అమ్మాయి ముస్తఫాతో కన్న రఫీ తో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ముస్తఫా తన స్నేహితులతో కలిసి రఫీ పై దాడిచేశాడు. గాయాలతో ఇంటికి చేరుకోగా చికిత్స నిమిత్తం అతనిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
రఫీ తండ్రి రియాజ్ అనంతరం ముస్తఫా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా తన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముస్తఫా రఫీను మరింత ఎక్కువగా వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో ఎంతో మనస్తాపానికి గురైన రఫీ జనవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం ముస్తఫా వేధింపులే కారణమని రఫీ తల్లిదండ్రులు అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…