Keerthy Suresh: మెనూ అడిగినందుకు చిరు కీర్తి పీక పట్టుకున్నారా… వామ్మో ఇదే అరాచకం బాసు?

Keerthy Suresh: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మెగా లీక్స్ ఒక వీడియోని విడుదల చేయగా అందులో చిరంజీవి కీర్తి సురేష్ పీకపట్టుకున్న సంఘటన మనం చూసాము అయితే తాజాగా అలా కీర్తి సురేష్ పీక పట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలియచేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కీర్తి కోసం తన ఇంటి నుంచే భోజనం వచ్చేదని చిరంజీవి తెలిపారు. మా ఇంట్లో తమిళ పనిమనిషి తనకు ఏమేం కావాలి అని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పంపించేవారని తెలిపారు.అయితే ఒక్కోసారి పప్పులో ఉప్పు కారం తక్కువైన కీర్తి వాటిని తినకుండా తిరిగి వెనక్కి పంపించేదని చిరు తెలిపారు.

Keerthy Suresh: మా ఇంటి ఫుడ్ తినేది..


ఇలా ఒక రోజు తాను షూటింగ్లో ఉండగా కీర్తి సురేష్ నా వద్దకు వచ్చి రేపు మెనూ ఏంటి అని నన్ను ప్రశ్నించింది. అయితే కోపం వచ్చిన తను సరదాగా కీర్తి పీక పట్టుకున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో నేటిజన్స్ పాపం మెనూ అడిగినందుకు పీక పట్టుకోవడం ఏంటి బాసు అంటూ కామెంట్ చేస్తున్నారు.