కీర్తి సురేష్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరేమో.. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న మహానటి. మహానటి సినిమా కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది.. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో వుంది. తాజగా కీర్తి నటించిన రంగ్ దే చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 26న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ప్రమోషన్లలో కీర్తి సురేష్ బిజీగా ఉంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మంచిమనిషి అయి వుండాలని, అతనిలో మానవత్వం మెండుగా ఉండాలని చెప్పింది. అయితే ప్రస్తుతానికి తాను పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదని కానీ సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయని తెలిపింది. తన పెళ్లి తనకు తెలియకుండానే మూడు, నలుగు సార్లు చేసారని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి తన పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉందని ఇప్పుడే దానిగురించి ఆలోచించాల్సిన పనిలేదని తెలిపింది కీర్తి సురేష్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…