Kiraak RP: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు.ఇలా ఈ కార్యక్రమం నుంచి బయటకు రాగానే ఈయన మల్లెమాల వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈ వివాదం తర్వాత ఆర్పీ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమై రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.
ఆర్పీ స్వస్థలం నెల్లూరు కావడంతో నెల్లూరులో ఎంతో ఫేమస్ అయినటువంటి చేపల పులుసు రెస్టారెంట్ ఈయన హైదరాబాద్లో ప్రారంభించారు.నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన ఆర్పీ అన్ని రకాల చేపలు పులుసును కట్టెల పొయ్యిపై తయారుచేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇక ఇక్కడ చేపల పులుసు చాలా టేస్టీగా ఉండటంతో ఎంతో మంది కస్టమర్లు తన హోటల్ ముందు క్యూ కట్టారు. అయితే ఇలా తన రెస్టారెంట్ బిజినెస్ ఎంతో అద్భుతంగా జరుగుతున్న నేపథ్యంలో ఉన్నఫలంగా ఈయన రెస్టారెంట్ మూతపడింది. ఇలా రెస్టారెంట్ మూతపడటానికి ఓ కారణముంది.
ఈ రెస్టారెంట్లో దొరికే చేపల పులుసు చాలా రుచికరంగా ఉండడంతో ఎంతోమంది ఇతని రెస్టారెంట్ ముందు క్యూ కడుతున్నారు. అయితే అందరికీ సరిపడా చేపల పులుసు ఆర్పీ అందించలేకపోవడంతో ఈయన రెస్టారెంట్ మూసివేసి చేపల పులుసు చేయడంలో మంచి అనుభవం ఉన్న వారిని హైదరాబాద్ తీసుకు వెళ్లడం కోసం నెల్లూరుకి వచ్చి వేట మొదలుపెట్టారట. ఇలా మనుషులు తక్కువగా ఉండటం వల్ల ఈయన తన రెస్టారెంట్ క్లోజ్ చేశారని త్వరలోనే మరి కొంతమంది మనుషులను నియమించుకొని ఏ ఒక్క కస్టమర్ వెనక్కి వెళ్ళకుండా చూసుకొనే ఆర్పీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…