Kirak RP: జబర్దస్త్ కార్యక్రమం గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాల గురించి కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతున్నాయి.ఈ క్రమంలోనే కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఈ విధంగా కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ ఆర్పికి మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలలో పూర్తిగా అవాస్తవాలే ఉన్నాయంటూ హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ షేకింగ్ శేషు వంటి జబర్దస్త్ కమెడియన్స్ మాత్రమే కాకుండా మరి కొంతమంది దర్శక నిర్మాతలు సైతం కిరాక్ ఆర్పి పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ విషయాలపై మరోసారి ఆర్పి స్పందిస్తూ..నేను జబర్దస్త్ కార్యక్రమం గురించి చెప్పిన మాటలన్నీ నిజమే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.నేను ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ అన్ని విషయాల గురించి బాగా ఓపెన్ అయ్యావు అంటూ ఫోన్లో చేశారని మెసేజ్లు చేశారని ఆర్పి తెలిపారు. ఇక షేకింగ్ శేషుని తాను జీవితంలో వదిలిపెట్టనని ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక నేను చెప్పిన మాటలన్నీ అవాస్తవమని ఎవరైనా నిరూపించగలిగితే తాను గుండు కొట్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆర్పి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏదిఏమైనా ఆర్పి జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాలు తర్వాత ఇలా మల్లెమాల వారి గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయన వెనుక ఎవరో ఉండి ఇలా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…