Kirrak RP : జబర్దస్త్ నుండి బయటికి వచ్చి తిండి సరిగా పెట్టరంటూ విమర్శించిన ఆర్పీ ఆపైన ఫుడ్ బిజినెస్ లోకే వచ్చాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో షాప్ ఓపెన్ చేసి నెల్లూరు లో చేసే చేపల పులుసు రుచిని హైదరాబాద్ వాసులకు అందిస్తున్నాడు. మొదట కూకట్ పల్లి లో ఓపన్ చేయగా జనాల రద్దీ కారణంగా అంత సప్లై చేయలేక కొంతకాలం షాప్ మూసేసి మళ్ళీ కిచెన్ అన్నింటినీ మార్చుకుని ఎక్కువ మంది వంటవాళ్లను నియమించుకుని మళ్ళీ రీ ఓపెన్ చేసాడు. అలా ఓపెన్ చేసి మళ్ళీ సక్సెస్ అయిన ఆర్పీ మణికొండ బ్రాంచ్ ఓపెన్ చేసాడు. అది కూడా సక్సెస్ అవడంతో ఇప్పుడు అమీర్ పేట్ బ్రాంచ్ ను ఓపెన్ చేసాడు కిర్రాక్ ఆర్పీ. అయితే ఒక్కో బ్రాంచ్ లో ఎంత ఆదాయం వస్తుంది ఇప్పటికైవరకు ఎంత పెట్టుబడి పెట్టాడు అన్న విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఒక్కో బ్రాంచ్ నుండి వచ్చే ఆదాయం ఎంతంటే…
కిర్రాక్ ఆర్పీ తన అమీర్ పేట్ బ్రాంచ్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ అందరం కష్టపడి జనాలకు నచ్చే విధంగా చేపల పులుసు రుచి చూపించామని, నా ఆలోచనలకు డబ్బు పెట్టుబడి పెట్టింది నా స్నేహితుడు అంటూ చెప్పారు. ఇక పెట్టుబడి ఎంత పెట్టామనే దానికంటే ఎక్కడా రాజీ పడకుండా సుచిగా శుభ్రంగా ఉండే వంటకాలను అందిస్తూ నాణ్యతలో రాజీ పడకుండా చేస్తున్నాం అంటూ చెప్పారు.
ఇక రెండు బ్రాంచ్ ల నుండి మా ఖర్చులన్నీ పోగా మిగులుతోందని తెలిపారు. ఎంత లాభం వస్తోంది అన్నది చెప్పనంటూ కిర్రాక్ ఆర్పీ సస్పెన్సులో పెట్టాడు. ఇక ఫ్రాంచైజీ కావాలనుకుంటే ఇస్తామని నెల్లూరు చేపల పులుసు బ్రాంచ్ లు మరిన్ని ఓపెన్ చేసే ఆలోచన ఉందంటూ చెప్పారు కిర్రాక్ ఆర్పీ. ఇక అమీర్ పేట్ బ్రాంచ్ ను హీరో శ్రీకాంత్ అలాగే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓపెన్ చేయడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…