Koratala Shiva: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. ఎంతోకాలంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ రావటంతో ఆలస్యం అవుతూనే ఉంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కిస్తున్న సినిమాలలో నటించడానికి గొప్ప గొప్ప నటీనటులను తీసుకోవటానికి దర్శకులు ఆసక్తి చూపుతారు. కానీ కొరటాల మాత్రం వాటికి విరుద్ధంగా సీరియల్ నటీనటులను ఈ సినిమాలో భాగస్వాములను చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ 30 సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సైఫ్ అలీ ఖాన్ కి భార్యగా సీరియల్ నటి చైత్ర నటిస్తున్నట్లు ఆమె ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..అయితే ఈ విషయం తెలియటంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ 30 లో సీరియల్ నటినటులు ఏమిటా అని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరొక సీరియల్ నటి ఎన్టీఆర్ 30లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ లో నటించిన మని చందన ఈ సినిమాలో జాన్వి కపూర్ తల్లి పాత్రలో నటిస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగు కన్నడ తమిళ్ భాషలలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ వార్త బయటికి రావటంతో నువ్వు సినిమా తీస్తున్నావా? లేక సీరియల్ తీస్తున్నావా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు కొరటాలపై విరుచుకుపడుతున్నారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…